New rule for TV channels: టీవీ ఛానెళ్లకు కొత్త రూల్.. ఇకపై ప్రతీరోజూ 30 నిమిషాలు ఇవి తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 mins of ‘national interest’ content daily made mandatory for TV channels: టెలివిజన్ ఛానెళ్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో ఈ కొత్త నియమాలను పేర్కొంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?
Also Read
త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అన్ని ఛానెళ్లు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు జాతీయాసక్తి ఉన్న కంటెంట్ ను ప్రసారం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైన విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత, రక్షణ మొదలైన అంశాల మీద కంటెంట్ ప్రసారం చేయాల్సి ఉంటుంది.
కనీసం 30 నిమిషాల పాటు వీటిని ప్రసారం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇండియాలో ఛానెల్ అప్ లింగ్, డౌన్ లింక్ చేయడానికి అనుమతి ఉన్న అన్ని కంపెనీలు కూడా జాతీయాసక్తి ఉన్న సామాజిక అంశాలపై ఒకరోజులో కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.
స్పోర్ట్స్ ఛానెళ్ల విషయంలో ఇలాంటివి సాధ్యపడిని చోట మినహా అన్ని ఛానెళ్లలో నేషనల్ ఇంట్రెస్ట్ కంటెంట్ ప్రసారం చేయాలని పేర్కొంది. ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేయవచ్చని.. ఛానెళ్లు దానికి అనుగుణంగా ప్రసారం చేయాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!