New rule for TV channels: టీవీ ఛానెళ్లకు కొత్త రూల్.. ఇకపై ప్రతీరోజూ 30 నిమిషాలు ఇవి తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 mins of ‘national interest’ content daily made mandatory for TV channels: టెలివిజన్ ఛానెళ్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో ఈ కొత్త నియమాలను పేర్కొంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే క్రీడలు, వన్యప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అన్ని ఛానెళ్లు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు జాతీయాసక్తి ఉన్న కంటెంట్ ను ప్రసారం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైన విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత, రక్షణ మొదలైన అంశాల మీద కంటెంట్ ప్రసారం చేయాల్సి ఉంటుంది.
కనీసం 30 నిమిషాల పాటు వీటిని ప్రసారం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇండియాలో ఛానెల్ అప్ లింగ్, డౌన్ లింక్ చేయడానికి అనుమతి ఉన్న అన్ని కంపెనీలు కూడా జాతీయాసక్తి ఉన్న సామాజిక అంశాలపై ఒకరోజులో కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.
స్పోర్ట్స్ ఛానెళ్ల విషయంలో ఇలాంటివి సాధ్యపడిని చోట మినహా అన్ని ఛానెళ్లలో నేషనల్ ఇంట్రెస్ట్ కంటెంట్ ప్రసారం చేయాలని పేర్కొంది. ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేయవచ్చని.. ఛానెళ్లు దానికి అనుగుణంగా ప్రసారం చేయాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!