Venu Goapl Reddy
Author- NTV Telugu-
Amritpal Singh: భింద్రన్వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
Manish Sisodia: ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలి.. జైలు నుంచి మోడీకి సిసోడియా లేఖ
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేకలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు. -
Kerala train attack: కేరళ రైలు ఘటనలో సంచలన విషయాలు.. ఉగ్రదాడిగా గుర్తించిన ఏటీఎస్
Kerala train attack: కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు. -
Pink Moon: ఈ పౌర్ణమిని “పింక్ మూన్”గా ఎందుకు పిలుస్తారో తెలుసా..?
Pink Moon: ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని ‘‘పింక్ మూన్’’గా పిలుస్తున్నారు. అయితే చంద్రుడు పింక్ కలర్ లో కనిపించకున్నా ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నారో తెలుసా..? అయితే దీని వెనక ఓ స్టోరీ ఉంది. పింక్ మూన్ విషయానికి వస్తే గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పింక్ మూన్ దర్శనం ఇస్తుంది. -
Corona Cases: భారీగా పెరిగిన కరోనా కేసులు.. నేడు కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం..
Corona Cases: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోలిస్తే 13 శాతం ఎక్కువగా కేసులు వచ్చాయి. -
Extramarital affair: లవర్ తో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఉప్పును ఉపయోగించి..
Extramarital affair: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు క్షణకాలం శారీరక సుఖం కోసం భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అతని మృతదేహాన్ని దొరకకుండా భారీ స్కెచ్ వేసింది. ఇలాంటి నేరాలు ఎంత దాచాలనుకున్నా పోలీసులకు ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంటాయి. ఈ కేసులో కూడా నిందితులు పోలీసులకు చిక్కారు. -
Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది. -
Mahindra Thar: ఏప్రిల్ ఆఫర్.. మహీంద్రా థార్పై భారీ డిస్కౌంట్..
Mahindra Thar: దేశీయ కార్ మేకర్ దిగ్గజం మహీంద్రా తన థార్ మోడల్ పై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా థార్ ఒకటి. కంపెనీ థార్ 4X4 వెర్షన్పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. థార్(ఫోర్ వీల్ డ్రైవ్) పెట్రోల్, డిజిల్ వేరియంట్లపై దాదాపుగా రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం థార్ AX (O), LX వేరియంట్లలో లభిస్తోంది. -
Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో తొక్కిసలాటలు జరిగి… -
IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!