Chhattisgarh: అంత్యక్రియల్లో మిగిలిన ఆహారం తిన్న 40 మందికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
People Fall Sick After Eating Leftover Food At Funeral In Chhattisgarh: అంత్యక్రియల తర్వాత మిగిలిన ఆహారం తిన్న 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 40 మంది అస్వస్థతలకు గురైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితులంతా ఆదివారం ఉదయం రామానుజ్నగర్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని విషున్పూర్ గ్రామంలో ఆహారం తీసుకున్నారని వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ సింగ్ తెలిపారు. బాధితులను సూరజ్ పూర్ ఆస్పత్రికి తరలించాగా.. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Cock Fights: కోడిపందాలపై ఆంక్షలు…పశ్చిమ గోదావరి ఎస్పీ వార్నింగ్
Also Read
వ్యక్తి మరణించిన తర్వాత పదో రోజు కార్యక్రమానికి వండిన వంటలు మిగిలాయి. వీటిని శనివారం బాధితులు తిన్నారు. ఆహారం తీసుకున్న రెండు మూడు గంటల తర్వాత మహిళలు, పిల్లలతో సహా 40 మంది వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వీరందరికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉన్నాయి. వీరందరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ కు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!