Venu Goapl Reddy
Author- NTV Telugu-
The Kerala Story: “ది కేరళ స్టోరీ”కి ఊరట.. పశ్చిమ బెంగాల్ నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు..
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై చిత్రనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగం కార్బన్ డేటింగ్పై విచారణకు సుప్రీం ఓకే
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం వంటి నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. -
Karnataka: డిప్యూటీ సీఎం దళితుడికి ఇవ్వకుంటే.. అధిష్టానానికి కాంగ్రెస్ లీడర్ వార్నింగ్..
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో అధికారంలో వచ్చింది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం విస్తృతంగా చర్చలు నిర్వహించింది. చివరకు సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది. వీరిద్దరు కూడా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వర పార్టీ అధిష్టానికి హెచ్చరికలు చేశారు. -
Karnataka: మా కరెంట్ బిల్లులు కాంగ్రెస్ కడుతుంది.. వారి నుంచే తీసుకోవాలి..
Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. -
Exoplanet: వామ్మో… ఆ గ్రహం నిండా అగ్నిపర్వతాలే.. 90 కాంతి సంవత్సరాల దూరంలో హెల్ ప్లానెట్
Exoplanet: భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయో అని శాస్త్రవేత్తలు ఆరా తీస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భూమిలాంటి గ్రహాలతో పాటు భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దవిగా ఉంటే గ్రహాలను కూడా కనుగొన్నారు. సౌరవ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల అణ్వేషణలో భాగంగా మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనికి LP 791-18 d పేరు పెట్టారు. పరిమాణంలో భూమిలా ఉన్నా కూడా ఇది పూర్తిగా అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని గుర్తించారు. -
Karnataka Politics: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్యే ఎందుకు..? డీకే ఎలా పట్టు నిలుపుకోనున్నారు..?
Karnataka Politics: కర్ణాటక పొలిటికల్ డైలామాకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉండనున్నారు. దాదాపుగా 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చలకు తెరపడింది. అయితే చివరి వరకు తనకు సీఎం పీఠం తప్పా ఏది ఆమోదయోగ్యం కాదని చెబుతున్న -
26/11 Mumbai terror attacks: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు అప్పగించనున్న అమెరికా
26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితులో్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది. -
Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు. -
BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది. -
Warming World: ప్రతీ సెకన్కు 10 ఏసీల అమ్మకం.. నివేదికలో వెల్లడి..
Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.
తాజావార్తలు
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో