Thyroid Diseases: థైరాయిడ్ కు మునగాకుతో చెక్..
Thyroid Diseases: ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలా వస్తున్న ఇలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి మన శరీరంలోని అనేక వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. ఈ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో కామన్ గా వచ్చేది ‘హైపో థైరాయిడ్’. ఈ వ్యాధి వస్తే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ తప్పకవాడాల్సి ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే..
Also Read
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
- Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
థైరాయిడ్ వచ్చిన వారిలో సహజంగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. నీరసం, అలసట, మానసికంగా కుంగిపోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతినిద్ర, చర్మ పొడిబారడం, జట్టు రాలిపోవడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం వంటివి హైపోథైరాయిడ్ లక్షణాలు. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య. అయోడిన్ లోపం, ఒత్తడి, జీవన విధానంలో లోపాలు వీటికి కారణాలుగా ఉంటాయి. కొన్ని సార్లు ఇవే కారణాలు అని కూడా చెప్పలేము. ఇలాంటి సమయంలో థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బేరికాయ, స్ట్రాబెర్రీస్ ను తినడం తగ్గించాలి. యోగసనాల్లో మత్స్య, భుజంగ, జిహాముద్ర అలాగే ఉజ్జయీ ప్రాణయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మునగాకుతో థైరాయిడ్ కు చెక్..
థైరాయిడ్ సమస్య ఉన్న వారు మునగాకుతో ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. చిన్న చిన్న ఇంటి చిట్కాల ద్వారా థైరాయిడ్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తీసుకోవాలి. మునగాకుల్ని కషాయంగా చేసుకుని రెగ్యులర్ గా తీసుకోవాలి. తరచూ మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాని ప్రయోజనాలను మన శరీరానికి అందించినవారం అవుతాం.
శొంఠి కొమ్ములను నేతిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంగా చేసుకుని, అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అరచెంచా శొంఠిపొడి నెయ్యి కలిపి తినాలి. లేకపోతే శొంఠి పొడితో కషాయం కాచుకోవాలి. 30 ఎంఎల్ పరిమాణంలో రోజూ తీసుకోవచ్చు.
Read Also:సెనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే!
తాజావార్తలు
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!