Naukri survey On IT Layoffs: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో ఉద్యోగాల తొలగింపు తక్కువే.. వీరి ఉద్యోగాలు ఊడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naukri survey On IT Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్య భయాలు ఐటీ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, డెల్, విప్రో వంటివి ఇప్పటివరకే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కువ ప్రభావితం అయింది మాత్రం అమెరికాలో పనిచేస్తున్నవారే. అయితే రానున్న కాలంలో ఇండియాలో కూడా ఉద్యోగాల తొలగింపు ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణుల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ. కామ్ మాత్రం భారతీయ ఐటీ నిపుణులకు సానుకూల వార్త వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో 2023 ప్రథమార్థంలో కేవలం కొన్ని ఉద్యోగాలు మాత్రమే పోయే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా సీనియర్ల పైనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఇదే సమయంలో భారతీయ ఐటీ ఉద్యోగులకు గణనీయంగా ఇంక్రిమెంట్లు ఉండే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇంక్రిమెంట్లు దాదాపుగా 20 శాతం ఉంటుందని తెలిపింది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
Read Also: K Laxman: కేసీఆర్ కలలు కంటున్నాడు.. కొత్త డ్రామా మొదలుపెట్టారు
నౌకరీ.కామ్ ఇటీవల 1400 మంది రిక్రూటర్లు, కన్సల్టెంట్లపై సర్వే నిర్వహించింది. చాలా మంది రిక్రూటర్లు 2023 తొలి భాగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువగానే ఉంటాయని అంచానా వేసింది. అయితే 4 శాతం మంది మాత్రం తమ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రధానంగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా సీనియర్ నిపుణులను నియమించుకోవడం తగ్గుతుందని.. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ల ఉద్యోగాలే ఊడుతాయని అంచానా వేశారు. ప్రెషర్లపై తక్కువ ప్రభావం పడే ఛాన్సుందని తెలిపారు.
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో కేవలం 15 శాతం అట్రిషన్ రేట్ ఉంటుందని, ఐటీ ఉద్యోగాలే టాప్ లో ఉంటాయని ప్రభావితం అవుతాయని సర్వే తెలిపింది. 92 శాతం మంది రిక్రూటర్లు ఈ ఏడాది తొలిభాగంలో నియామకాలు సానుకూలంగానే ఉంటాయని, 29 శాతం మంది మాత్రం కొత్త ఉద్యోగాల క్రియేషన్ మాత్రమే ఉంటుందని సర్వేలో తెలిపారు. 17 శాతం మంది తమ ఉద్యోగులను మెంటైన్ చేయాలని చూస్తున్నట్లు అంచానా వేశారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!