Air India: నెక్ట్స్ ఎమిరేట్స్ కావాలన్నదే ఎయిరిండియా లక్ష్యం.. అందుకే రికార్డ్ స్థాయిలో విమానాల కొనుగోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే. ఏవియేషన్ హిస్టరీలోనే ఇది భారీ డీల్.
ఫ్రాన్స్ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్ నుంచి 220 విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఎయిర్ బస్ నుంచి 40 వైట్ బాడీ-ఏ 350 విమానాలు, 210 నేరో బాడీ-ఏ 320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బోయింగ్ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్ 787-ఎస్, 10, 777 9ఎస్ తో 737 మ్యాక్స్ విమానాలు 190 కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఇటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, బ్రిటన్ పీఎం రిషి సునాక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ దేశాలకు భారత్ నుంచి ఈ డీల్ చాలా పెద్ద ఊరట.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
చైనాను మించి భారత్ జనాభా పెరిగింది. ఏకంగా 140 కోట్ల ప్రజలు ఉన్న, రాబోయే కాలంలో ఎకనామిక్ సూపర్ పవర్ గా ఉన్న ఇండియాలో విమానయానం చాలా వరకు చాలా మందికి కలగానే ఉంది. ఇంత జనాభా ఉన్న భారత దేశంలోని ఏ విమానయాన సంస్థ కూడా టాప్-10 ఎయిర్ లైన్స్ జాబితాలో లేదు. ప్రస్తుతం దేశంలో కేవలం 700 విమానాలు మాత్రమే ఉన్నాయి. టాటా సంస్థ మాత్రం ఎయిరిండియాను ప్రపంచస్థాయి ఎయిర్ లైనర్ గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉంది. ఎయిరిండియాను గ్లోబల్ స్థాయి సంస్థగా తీర్చిదిద్దనున్నారు. మరో ఎమిరేట్స్ విమానయాన సంస్థగా మారాలని ఎయిర్ ఇండియా లక్ష్యంతో ఉంది.
ప్రస్తుతం ఏయిరిండియా వద్ద కేవలం 100కు మించి మాత్రమే విమానాలు ఉన్నాయి. గత దశాబ్ధం కాలంగా కొత్త విమానాలనే కొనుగోలు చేయలేదు. కానీ టాటాల చేతికి వచ్చిన తర్వాత ఏయిరిండియా అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నారు. రానున్న కాలంలో ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ కు ధీటుగా ఎదగాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇక డొమెస్టిక్ గా కూడా విమానయాన సేవలు విస్తృతం కాబోయే అవకాశం ఉంది. గత ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 147 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో 200కు మించి ఎయిర్ పోర్టులు రానున్నాయి. భారతదేశాన్ని ప్రపంచ స్థాయి కనెక్టింగ్ హబ్గా, అలాగే పర్యాటకులు మరియు వ్యాపారాలకు గమ్యస్థానంగా మార్చాలని కోరుతూ, విమానాశ్రయ విస్తరణను రెట్టింపు చేస్తూ సుదూర విమానాలను పెంచడానికి ప్రభుత్వం విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!