LeT leader: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు, పాక్ సైన్యంపై విరుచుకుపడింది. పీఓకే, పాకిస్తాన్లోని ఇతర భాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారత్ తమ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని లష్కరేతోయిబా(ఎల్ఇటి) అగ్ర నాయకుడు అంగీకరించాడు. అయినప్పటికీ, భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు. […]
Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్లో ఇది […]
New Year 2026: కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్కమ్ చెప్పింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్లోని ప్రతిష్టాత్మక స్కై టవర్పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి.
Nushrratt Bharuccha: ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో ఆమె పాల్గొన్నారు. ఆయల పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో నుష్రత్ ఆలయాన్ని సందర్శించారు.
Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
Rajasthan: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడి ఘటన మరవక ముందే, రాజస్థాన్లో కారులో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్తో నిండిన ఒక మారుతి సియాజ్ కారును బుధవారం రాజస్థాన్లోని టోంక్లో గుర్తించారు.
Woman Gang-Ra*ped: హర్యానా ఫరీదాబాద్లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న వ్యాన్లో 28 ఏళ్ల మహిళపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన మంగళవారం-సోమవారం మధ్య రాత్రి జరిగింది. గ్యాంగ్ రేప్ తర్వాత దారుణంగా గాయపడిన మహిళను మంగళవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన విసిరేశారు. మహిళను అపహరించిన సమయంలో ఆమె తన ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది.
India economy: భారతదేశం 4.18 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రభుత్వం తెలిపింది. 2030 నాటికి జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతదేశ […]
Gig Workers Strike: దేశవ్యాప్తంగా డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్లకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెలోకి వెళ్తుండటంతో, న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం పడనుంది. ఏడాదిలో అత్యంత అమ్మకాలు జరిగే ఈ రోజే వర్కర్లు స్ట్రైక్ చేస్తుండటంతో కస్టమర్ల ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇయర్ ఎండ్ రెవెన్యూ టార్గెట్లను చేరుకోవడానికి డిసెంబర్ 31 డెలివరీలపై ఆధారపడే రిటైలర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సమ్మె […]
Pakistan: పాకిస్తాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన అసిమ్ మునీర్ కుమార్తె వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. మునీర్ కుమర్తె మహనూర్ను డిసెంబర్ 26న తన అబ్దుల్ రెహమాన్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లి పాక్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సైన్యంలో ముఖ్యులు, ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను విడుదల చేయలేదు.