Powermen vs policemen: ఉత్తర్ ప్రదేశ్లో రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. హాపూర్లో విద్యుత్ అధికారులు, పోలీసుల మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. భద్స్యానా గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టర్ ప్రదీప్ కుమార్, కరెంట్ వినియోగదారుడు అమర్పాల్కు మధ్య జరిగిన ఘర్షణ పూర్తిస్థాయిలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య వివాదంగా మారింది. ఈ ఘర్షణ తర్వాత ప్రదీప్ కుమార్, అమర్పాల్ను పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో వివాదం […]
Amit Shah: పార్లమెంట్ ‘‘ఓట్ చోరీ’’ అంశంపై దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఓట్ చోరీపై తనతో సభలో చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై చర్చించేందు అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. హర్యానాలో 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే, దీనికి ప్రతిగా నా ప్రసంగంలో నేను ఎప్పుడు ఏది […]
New Kia Seltos: అవతార్లో సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్(Kia Seltos) అన్విల్ అయింది. కొరియన్ కార్ మేకర్ కియా తన ఏస్ మోడల్ సెల్టోస్ను మరింత స్టైలిష్గా తీర్చిదిద్దింది. సరికొత్త ఫీచర్లు, డిజైన్తో ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నాడీఎంకే పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), టీటీవీ దినకరన్లు మళ్లీ ఎన్డీయే గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా సాంప్రదాయ అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ […]
Pakistan: నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: Pinaka Mk4 Missile: ఇక […]
YouTube: యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడి సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో ఒక మహిళకు యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె చనిపోయింది. అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు యూట్యూబ్ ట్యుటోరియల్లో చూసిన తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది. Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. […]
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది.
Saudi Arabia: ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఇస్లాంకు పుట్టినిల్లుగా ఉన్న సౌదీ అరేబియా కూడా మారాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సౌదీ ప్రభుత్వం మధ్యం కొనుగోలు నిబంధనల్ని కొంచెం సడలించింది. నెలకు 50,000 రియాల్స్ ($13,300) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులు మద్యం కొనుగోళ్లు చేయడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిన ఇండియాలో పెడుతున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది భారతదేశ ఆశయాలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. భారతదేశ ‘‘AI ఫప్ట్ ప్యూచర్’’ నిర్మించేందుకు, డెవలప్ చేసేందుకు $17.5 బిలియన్లు( రూ. 1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.