Covid-19: కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు కోవిడ్ మహమ్మారి ఎంట్రీ..
- సరిగ్గా ఆరేళ్ల క్రితం కోవిడ్-19 ఎంట్రీ..
- చైనా వూహాన్ నగరంలో మొదటగా కేసులు..
- 2020 మార్చి నాటికి ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్డౌన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
కరోనాకు కేంద్రంగా వూహాన్:
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
ఈ మొత్తం కరోనాకు చైనాలోని వూహాన్ నగరం కేంద్రంగా మారింది. చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, లక్షణాల తీవ్రంగా ఉండటంతో అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇది నెమ్మదిగా చైనా నుంచి ప్రపంచంలోని మిగతా దేశాలకు వ్యాప్తించింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని, ఆరోగ్య వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది.
వూహాన్లోని ఫిష్ మార్కెట్లో మొదటగా ఈ కోవిడ్-19 కేసుల్ని గుర్తించారు. ఇది మహాసముద్రాలు దాటి యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని ఇతర దేశాలకు చేరింది. 21వ శతాబ్దపు అత్యంత వినాశకరమైన మహమ్మారిగా మారింది. మార్చి 2020 నాటికి, వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ను అరికట్టడానికి దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. నగరాలను స్మశానాలను తలపించేలా ‘‘లాక్డౌన్’’ పరిస్థితిలోకి వెళ్లాయి. అధికారికంగా కోవిడ్-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ల మంది ప్రాణాలు వదిలారు. మహా మాంద్యంత తర్వాత ఎప్పుడూ చూడని విధంగా పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కుచించుకుపోయాయి.
భారత్లో లాక్డౌన్:
కోవిడ్-19ను అరికట్టడానికి భారత్ మార్చి 2020లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ముందుగానే వినాశనాన్ని గుర్తించిన కేంద్రం.. ఆస్పత్రులు, పరీక్షలు, ఆక్సిజన్ సరఫరా సప్లై చైన్ను బలోపేతం చేయడానికి సమయాన్ని సంపాదించుకుంది. కానీ, కోవిడ్-19 డెల్టా వేరియంట్ వారాల్లోనే లక్షలాది మందిని చంపింది. అయినప్పటికీ, భారత్ ఒక ఏడాది లోపే వ్యాక్సిన్ను తయారు చేసుకోగలిగింది.
భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ను భారీగా ఉత్పత్తి చేసింది. లక్షలాది మంది మరణాలను అడ్డుకునేందుకు సహాయపడ్డాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరేళ్ల క్రితం వూహాన్ నుంచి వచ్చిన ఈ కరోనా వైరస్, ప్రపంచ దేశాలకు ఆరోగ్య అత్యవసర స్థితికి ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పించింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!