Veerababu Burugadda
Author- NTV Telugu-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. మొత్తం 4,41,667 ఉంగరాల కొనుగోలుకు రూ. 755.83 కోట్ల ఖర్చు అంచనాతో పిలిచిన టెండర్లో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. బంగారం ధరను మినహాయించి మేకింగ్, వేస్టేజ్, హాల్మార్కింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులన్నింటికీ కలిపి ప్రముఖ […] -
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గత 19 రోజులుగా కనిపించకుండాపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 3న వేటకు బయలుదేరిన ఈ బోటుతో 5వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ తెగిపోయింది. సాధారణంగా వేటకు వెళ్లినవారు తిరిగొస్తారనే నమ్మకంతో కుటుంబసభ్యులు ఈ నెల 13వ తేదీ వరకు వేచి చూశారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి […] -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మూడో విడత కింద రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. 1996లో తానే స్వయంగా ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని, […] -
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి 1,777 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 200 H1N1 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 8 రెట్లు పెరిగాయి. అపోలో, మ్యాక్స్ వంటి ప్రముఖ ఆసుపత్రుల వద్ద రోగుల సంఖ్య పెరిగింది. ప్రతీ 20 మంది ఓపిడి రోగులలో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్గా తేలుతోందని వైద్యులు […] -
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ను ఇన్నింగ్స్ , 103 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్ల ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగగా, ఇంగ్లాండ్ వేగవంతమైన బౌలర్లు మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా లీడ్స్ పిచ్పై ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు జొఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన చేస్తూ వికెట్ల […] -
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ బోనస్ సొమ్ము అందాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 7 రకాల సన్న వరి విత్తనాలను మాత్రమే సాగు చేసి ఉండాలి. అందులో ఆర్ఎస్ఆర్ 15048 […] -
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
పేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వాలు రూపాయి ఖర్చుకు వెనుకాడకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లబ్ధి అక్రమార్కుల పాలిట ‘కాసుల పంట’గా మారుతోంది. రూపాయి లేకపోయినా పేదవాడు ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంటే, ఆ పథకం ఆశయం కాస్తా దారి మళ్లుతోంది. ఉచిత బియ్యం అర్హులైన పేదల కడుపు నింపాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ వ్యాపారుల జేబులు నింపుతుండటం తీవ్ర విచారకరం. తినడానికి ఇచ్చే బియ్యం.. గడప దాటక ముందే […] -
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, ఈ WTC లో ఆడిన 7 మ్యాచ్ల్లో పాకిస్థాన్కు ఇది 5వ ఓటమిగా నమోదైంది. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాకిస్థాన్ చివరి స్థానమైన 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, విజయం సాధించిన ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో 7వ స్థానంలో […] -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
తెలంగాణలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికీ రాబోయే 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను నేరుగా ప్రజల చెంతకు చేర్చాలనే తపనతోనే ప్రభుత్వం ఈ చర్యలు […] -
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు ఆర్ధిక భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు రిజర్వేషన్ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ రాకపోకల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం (రిటర్న్ జర్నీ) టికెట్పై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి, అలాగే వారాంతాల్లో కుటుంబంతో కలిసే వెళ్లేవారికి ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు […]
తాజావార్తలు
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!