Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,02,009 ఎస్హెచ్జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.36,000 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఎస్హెచ్జీ మహిళకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMJJBY, PMSBY) పథకాల ద్వారా వంద శాతం బీమా రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాల ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల మినహాయింపుపై మహిళల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
మహిళా ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా వారు తయారు చేసే 65 రకాల నాణ్యమైన ఉత్పత్తుల విక్రయం కోసం ఇప్పటికే నాలుగు ‘స్వయం’ బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీవనోపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఉపాధి నైపుణ్యాలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!