Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. టికెట్లకు భారీ […] -
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
భారతదేశంలో రూ. 1 కోటి కార్పస్ అనేది ఒకరి ఆర్థిక భద్రతకు, భవిష్యత్తు ఆశయాలకు ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. చాలా మంది ఇంత పెద్ద మొత్తాన్ని సాధించాలంటే భారీ పెట్టుబడులు అవసరమని భావిస్తారు, కానీ అది నిజం కాదు. క్రమశిక్షణతో కూడిన చిన్న పెట్టుబడుల ద్వారా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక అద్భుతమైన మార్గం. రూ. 20,000 SIP ద్వారా […] -
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్పై భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్కు ఇది మూడో విజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. నిర్ణీత […] -
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26 నుంచి ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్తో భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ యుగం ముగిసి, శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి తెరలేవబోతోంది. ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ భారత టీ-20 జట్టుకు 15వ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాధారణంగా చాలామంది అభిమానులు మహేంద్ర సింగ్ ధోనినే భారత్కు తొలి టీ-20 కెప్టెన్ అని భావిస్తుంటారు, కానీ అది తప్పు. భారత పురుషుల జట్టు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ […] -
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్లో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు […] -
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు టీమిండియా సర్వసిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ-20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న సాయంత్రం వేళల్లో జరగనున్నాయి. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే నాలుగో ద్వైపాక్షిక టీ-20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఐర్లాండ్తో జరిగిన ప్రతి టీ-20 సిరీస్లోనూ […] -
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
గ్లోబల్ సప్లై చైన్లో మెమొరీ భాగాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల యాపిల్ సంస్థ భారతదేశంలో తన మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల అనివార్యమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందే సూచించగా.. ప్రస్తుతం పెరిగిన కొత్త ధరలు యాపిల్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. మ్యాక్బుక్ కొత్త ధరల వివరాలిలా.. మ్యాక్బుక్ ఎయిర్ 13-ఇంచ్ (M5).. దీని […] -
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోటీల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ రెండు జట్లు తలపడినప్పుడు తన భార్య సమియా అర్జూ ఎప్పుడూ తనకే మద్దతు ఇస్తుందని, అయితే ఆమె భారతదేశానికి చెందినది కావడంతో సహజంగానే భారత్ గెలవాలని కూడా కోరుకుంటుందని ఆయన చెప్పారు. భారతదేశానికి చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అయిన సమియా, 2019లో దుబాయ్లో హసన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఒక […] -
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గతంలో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగించి.. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాను సంక్షోభానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది. అలాగే.. ఆ సమయంలో పూర్తిగా నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను కూడా 50 శాతం మేర పునరుద్ధరించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పెద్ద ఉపశమనం లభించింది. ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సంక్షోభం తలెత్తినప్పుడు దేశీయంగా […] -
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఒక కీలకమైన మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగార్ సుల్తానా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది, దాంతో భారత జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది. గ్రూప్-A లో జరుగుతున్న ఈ పోరు ఇరు జట్లకు, ముఖ్యంగా భారత మహిళల జట్టుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. […]
తాజావార్తలు
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!