Veerababu Burugadda
Author- NTV Telugu-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలో మద్యం షాపుల మూసివేతపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. పండుగ రోజుల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగా 2026, ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజున నిర్ణీత పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ సైబరాబాద్ […] -
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
వీసా దరఖాస్తు ప్రక్రియలో తప్పుడు, అసంపూర్తి సమాచారాన్ని సమర్పించినందుకు పాకిస్తాన్ క్రికెటర్ హమ్జా నజర్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడిని రెండు సంవత్సరాల పాటు అన్ని రకాల డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, 10 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బోర్డు ద్వారా వీసా కోసం […] -
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
శ్రీలంక ఎలేవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఎలేవన్, మ్యాచ్ మొదటి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రవిందు రసంత, నిషాన్ మదుష్కతో పాటు కెప్టెన్ సోనాల్ అర్ధశతకాలతో రాణించడంతో జట్టు ఆరంభం నుంచే బలమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు తొలి వికెట్కు 110 పరుగుల […] -
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగు నీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే.. […] -
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎల్నినో వంటి వాతావరణ ప్రతికూల ప్రభావాలు తగ్గి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే బృహత్తర సంకల్పంతో నాగార్జునసాగర్ వేదికగా ఈ పవిత్ర వైదిక క్రతువుకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిద్ధాంతి శాస్త్రోక్తంగా చర్చించి ఆగస్టు 10వ తేదీని శుభ ముహూర్తంగా […] -
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు , పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీ ఫీజు వివరాలను తప్పనిసరిగా బహిరంగపరచాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ ఫీజుల వివరాలను ప్రాంగణంలోని నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు పాఠశాల అధికారిక వెబ్సైట్లోనూ ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. విద్యాశాఖ అధికారిక […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నియమించడంపై దేశవాళీ దిగ్గజ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో 15 ఏళ్ల వైభవ్కు కీలక బాధ్యత అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న కొద్ది రోజులకే అతనికి ఈ పదవి దక్కింది. యువ ఆటగాడిని నాయకత్వ […] -
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత దేశంలో దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం ఇదేనని, ఇది దేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తోందని చెప్పారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ […] -
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ను క్రికెట్ సౌతాఫ్రికా సవరించింది. మునుపటి షెడ్యూల్లో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్లు మాత్రమే ఉండగా, తాజాగా మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను కూడా కొత్తగా చేర్చారు. దీనివల్ల భారత జట్టు మరో వారం రోజుల పాటు దక్షిణాఫ్రికాలోనే అదనంగా గడపాల్సి ఉంటుంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9 నుండి 12 వరకు గెబెర్హాలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ […] -
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
హైదరాబాద్లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA – హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 […]
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!