అగ్ర రాజ్యం అమెరికాను కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. అరుదైన దోమల కారణంగా ఈఈఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్ కారణంగా న్యూ హాంప్షైర్లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా అలర్ట్ అయింది. ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత రక్షణే దీనికి మార్గమని అధికారులు సూచించారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మూడు వారాలు అవుతున్న న్యాయం కోసం డాక్టర్లు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
బంగ్లాదేశ్లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఇటీవల ముడా స్కామ్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సిద్ధరామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రిలీప్ దొరికింది.
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్షా ఘై కల్రా భర్త అంకిత్ కల్రా ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానులను షాక్కు గురిచేసింది. అంకిత్ కల్రా వయసు 29. ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగభరితమైన పోస్ట్లో హృదయపూర్వక సందేశంతో అంకిత్ చిత్రాన్ని పంచుకున్నారు.
బంగ్లాదేశ్ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసి లేఖ తాజాగా వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మమత లేఖ రాసింది. కోల్కతా ఘటన తర్వాత ఈ లేఖ వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ను కూడా విచారించనున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. డిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బావేజాకు సీబీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లుంటారంట. లోకంలో సహజంగా వాడుతుంటారు. ఏదొక చోట.. ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా అప్రమత్తం కాక.. చాలా మంది మోసపోతున్నారు.