Mamata banerjee: సీబీఐ దర్యాప్తు చేపట్టి 16 రోజులైంది.. న్యాయమెక్కడా?
- సీబీఐ దర్యాప్తు చేపట్టి 16 రోజులైంది?
- కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై న్యాయమెక్కడా?
- సీఎం మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మూడు వారాలు అవుతున్న న్యాయం కోసం డాక్టర్లు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా సీబీఐ తీరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Nandyala: అమానుషం.. మానసిక వికలాంగురాలైన మైనర్పై అత్యాచారం
Also Read
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమత మాట్లాడారు.. వైద్యురాలు హత్యాచారానికి గురైన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లిదండ్రులను కలిశానని ఆమె చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. విపక్షాలు న్యాయం కోరుకోవడం లేదని.. ఆలస్యం కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం కావాలని కోరుకునేవాళ్లు బీజేపీలో లేరన్నారు. బీజేపీ వాళ్లు బెంగాల్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లంతా కుట్రలో మునిగి తేలుతున్నారని మమత మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిస్తుందని… రేపిస్టులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని మమత చెప్పుకొచ్చారు. మంగళవారం ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు షెల్స్, వాటర్ క్యానన్లు, లాఠీలను ప్రయోగించారని.. 200 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా చెడ్డ పేరు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఇక తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కోల్కతా ఘటన దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. యావత్ భారతదేశం న్యాయం కోరుతోందన్నారు. కానీ కొందరు వ్యక్తులు మృతదేహంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నావ్, హత్రాస్, కథువా మరియు బద్లాపూర్ కేసులకు బీజేపీ వాళ్లే బాధ్యులని ఆరోపించారు. రేప్ కేసుల్లో కాలపరిమితితో కూడిన విచారణ మరియు శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. దీని కోసం మమతా బెనర్జీ చట్టం చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే అత్యాచార నిరోధక చట్టం కోసం తృణమూల్ పార్టీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశపెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సీబీఐ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్
తాజావార్తలు
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్స్టాపబుల్’ రైటర్తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!