US: దోమల కారణంగా కొత్త వైరస్.. ఒకరి మృతి.. అమెరికా అలర్ట్
- అగ్ర రాజ్యాన్ని కలవరపెడుతున్న ఈఈఈ వైరస్
- న్యూ హాంప్షైర్లో చికిత్స పొందుతూ ఒకరి మృతి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాను కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. అరుదైన దోమల కారణంగా ఈఈఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్ కారణంగా న్యూ హాంప్షైర్లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా అలర్ట్ అయింది. ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత రక్షణే దీనికి మార్గమని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: FM Radio: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు.. ఎక్కడెక్కడంటే..?
Also Read
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
న్యూ హాంప్షైర్లోని హాంప్స్టెడ్ నివాసి అత్యంత అరుదైన ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలాడు. న్యూ హాంప్షైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (డీహెచ్హెచ్ఎస్) నుంచి ఒక ప్రకటన వెలువడింది. వయోజన రోగి తీవ్రమైన కేంద్ర నాడీ వ్యవస్థ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడని.. అనంతరం చికిత్స పొందుతూ అనారోగ్యంతో మరణించాడని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. 2014 నుంచి ఇదే మొదటి మరణం కేసుగా అధికారులు పేర్కొ్న్నారు. న్యూ హాంప్షైర్ రాష్ట్రంలో మూడు అంటువ్యాధులను నమోదు చేయగా.. అందులో రెండు ప్రాణాంతకమైనవిగా తెలిపారు. ఇక తాజాగా నమోదైన ఈఈఈ వైరస్ ప్రమాదకరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఇది తీవ్ర అవుతుందని హెచ్చరించారు. ఈ వైరస్ సోకితే 30 శాతం మంది ప్రాణాలు కోల్పోతారని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పబ్లిక్ పార్కులను మూసివేయాలని సూచించారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
లక్షణాలు ఇవే..
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. జ్వరం, తలనొప్పి, వాంతులు, అతిసారం, మూర్ఛలు, ప్రవర్తనా మార్పులు, మగత వంటి లక్షణాలతో కూడిన తీవ్రమైన అనారోగ్యంగా EEEని తెలుసుకోవచ్చన్నారు. మరింత తీవ్రమైన సందర్భాల్లో వైరస్ మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉన్న పొరల వాపుకు దారితీస్తుందని వెల్లడించారు. దాదాపు 30 శాతం మంది ఈ వ్యాధికి లోనవుతున్నారని.. చాలా మంది బతికి ఉన్నవారు దీర్ఘకాలిక శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని చెప్పారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మరియు 50 ఏళ్లు పైబడిన వారు తీవ్రమైన ప్రమాదానికి గురవుతారని అధికారులు పేర్కొన్నారు.
నివారణ మరియు ప్రజారోగ్య సిఫార్సులు..
EEE కోసం టీకాలు లేదా నిర్దిష్ట చికిత్సలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్య అధికారులు అనేక నివారణ చర్యలను సిఫార్సు చేస్తారు. కీటక వికర్షకాలను ఉపయోగించడం, ఆరుబయట ఉన్నప్పుడు రక్షిత దుస్తులు ధరించడం మరియు దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను తగ్గించడానికి ఇళ్ల చుట్టూ ఉన్న నీటిని తొలగించడం వంటివి చేయాలని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత రక్షణతోనే ఈఈఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mollywood: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపులు కలకలం.. ఇప్పటి వరకు 17 కేసులు..
తాజావార్తలు
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
-
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
-
Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
-
OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!