Mumbai Dating Scam: డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ.. భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ
- భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- ముంబైలో వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లుంటారంట. లోకంలో సహజంగా వాడుతుంటారు. ఏదొక చోట.. ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా అప్రమత్తం కాక.. చాలా మంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. అంతా అయిపోయాక… లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అసలు ఈ డేటింగ్ స్కామ్ ఏంటి? ఇందులో దాగి ఉన్న మోసం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్లోని గాడ్ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. తినేశాక.. ఇప్పుడే వస్తానంటూ మధ్యలో జారుకుంటుంది. ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో రూ.61, 743 బిల్లు చూసి బాధితుడు అవాక్కయ్యాడు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. ఇక బిల్లులు చెల్లించలేక అబ్బాయిలు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తు్న్నారు. ఇలా ముంబైలో పలు క్లబ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
జర్నలిస్ట్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆయా వ్యక్తులు తమకు ఎదురైన కష్టాలు, జరిగిన స్కామ్ గురించి పోస్ట్ చేసినప్పటికీ ముంబై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బిల్లులు చెల్లించకపోతే దారుణాతీదారుణంగా బౌన్సర్లతో దాడి చేయిపిస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ డేటింగ్ స్కామ్పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
తాజావార్తలు
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
-
Japan Squad: భారత్తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!