Mumbai Dating Scam: డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ.. భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ
- భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- ముంబైలో వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లుంటారంట. లోకంలో సహజంగా వాడుతుంటారు. ఏదొక చోట.. ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా అప్రమత్తం కాక.. చాలా మంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. అంతా అయిపోయాక… లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అసలు ఈ డేటింగ్ స్కామ్ ఏంటి? ఇందులో దాగి ఉన్న మోసం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్లోని గాడ్ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. తినేశాక.. ఇప్పుడే వస్తానంటూ మధ్యలో జారుకుంటుంది. ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో రూ.61, 743 బిల్లు చూసి బాధితుడు అవాక్కయ్యాడు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. ఇక బిల్లులు చెల్లించలేక అబ్బాయిలు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తు్న్నారు. ఇలా ముంబైలో పలు క్లబ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
జర్నలిస్ట్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆయా వ్యక్తులు తమకు ఎదురైన కష్టాలు, జరిగిన స్కామ్ గురించి పోస్ట్ చేసినప్పటికీ ముంబై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బిల్లులు చెల్లించకపోతే దారుణాతీదారుణంగా బౌన్సర్లతో దాడి చేయిపిస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ డేటింగ్ స్కామ్పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?