Mumbai Dating Scam: డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ.. భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ
- భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- ముంబైలో వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లుంటారంట. లోకంలో సహజంగా వాడుతుంటారు. ఏదొక చోట.. ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా అప్రమత్తం కాక.. చాలా మంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. అంతా అయిపోయాక… లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అసలు ఈ డేటింగ్ స్కామ్ ఏంటి? ఇందులో దాగి ఉన్న మోసం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్లోని గాడ్ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. తినేశాక.. ఇప్పుడే వస్తానంటూ మధ్యలో జారుకుంటుంది. ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో రూ.61, 743 బిల్లు చూసి బాధితుడు అవాక్కయ్యాడు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. ఇక బిల్లులు చెల్లించలేక అబ్బాయిలు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తు్న్నారు. ఇలా ముంబైలో పలు క్లబ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
జర్నలిస్ట్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆయా వ్యక్తులు తమకు ఎదురైన కష్టాలు, జరిగిన స్కామ్ గురించి పోస్ట్ చేసినప్పటికీ ముంబై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బిల్లులు చెల్లించకపోతే దారుణాతీదారుణంగా బౌన్సర్లతో దాడి చేయిపిస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ డేటింగ్ స్కామ్పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
తాజావార్తలు
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!