Bangladesh: బంగ్లాదేశ్లో వరదలు.. 13 మంది మృతి
- బంగ్లాదేశ్లో వరదలు.. 13 మంది మృతి
- నిరాశ్రయులైన 8 లక్షల మంది ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
బంగ్లాదేశ్లోని అనేక జిల్లాల్లో వరదల కారణంగా కనీసం 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 8 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ మరియు సహాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, బోర్డర్ గార్డ్స్, ఫైర్ సర్వీస్, పోలీసులు మరియు ఇతర ఎన్జీవోలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. కుమిల్లా, నోఖాలి, బ్రాహ్మణబారియా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, సిల్హెట్ మరియు హబిగంజ్ జిల్లాలు వరదల బారిన పడ్డాయి. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. సహాయాన్ని అందించడానికి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ముంపు ప్రాంతాల నుంచి 188,739 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, బాధిత వర్గాలకు ప్రభుత్వం నగదు, బియ్యం, పొడి ఆహార పదార్థాలను అందజేస్తోందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ హసన్ తెలిపారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ఇది కూడా చదవండి: Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?
దేశంలోని తూర్పు ప్రాంతంలోని ఐదు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ (BTRC) డేటా ప్రకారం వరద ప్రభావిత జిల్లాల్లో 14% మొబైల్ టవర్లు ఉన్నాయి. అవి పనిచేయడం మానేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని షెల్టర్ సెంటర్లలో డ్రై ఫుడ్, డ్రింకింగ్ వాటర్ మరియు టాయిలెట్ సౌకర్యాలను అందిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద NGO సంస్థ అయిన డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ లియాకత్ అలీ అన్నారు. ప్రస్తుతం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Kolkata doctor case: సందీప్ ఘోష్కు సీఎం మమత బర్త్డే విషెస్ చెప్పిన లేఖ వైరల్
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!