దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుస లాభాల్లో దూసుకెళ్తోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా.. అనంతరం సూచీలు గ్రీన్లోకి వచ్చేశాయి. సెన్సెక్స్ 349 లాభపడి 82, 134 దగ్గర ముగియగా.. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 25, 151 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.83.99 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసిం
బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ ‘ఎక్స్’ ట్విట్టర్లో మమతను నిలదీశారు.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్.జగద్రక్షకన్కు ఈడీ షాకిచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ డాక్టర్లంతా రోడ్లపైనే ఉన్నారు. న్యాయం కోసం గొంతెత్తున్నారు. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సూచంచింది.
మహారాష్ట్రలోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 8 నెలల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
జమ్మూకాశ్మీర్లోని రాజ్గఢ్, రాంబన్లో ఒక్కసారిగా బుధవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రవాహం ఏరులైపారింది. ఆకస్మిక వరదల్లో మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. మరో నలుగురు తప్పిపోయారు.
రెస్టారెంట్లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో మహిళా టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాజధాని ఢాకాలోని హతిర్జీల్ సరస్సు నుంచి బుధవారం ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.
గుజరాత్ను భారీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కుండపోత వర్షం కురవడంతో పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి.