అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్ను ప్రారంభించారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థానే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడంటూ.. అతడు దేశద్రోహి అంటూ షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు తెగబడింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది చనిపోగా.. మరోసారి ఆదివారం కూడా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు తెగబడ్డాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు హతమయ్యారు. మరోవైపు నాజర్ ఆస్పత్రి మృతులు, క్షతగాత్రులతో నిండిపోయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమానం ప్రకటించారు. ఓవర్టైమ్ జీతాన్ని తానే చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ట్రంప్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను చేయాల్సి వస్తే.. తన జేబు నుంచి వారికి ఓవర్టైమ్ జీతం చెల్లిస్తానని తెలిపారు.
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు సాగిస్తోంది. గత సోమవారం నుంచి దాడులను ఉధృతం చేసింది. 400 మందికిపైగా చనిపోయినట్లుగా హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమయ్యాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్లో పోస్టు చేసింది.
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు.