West Bengal: ” రీల్స్” చేస్తుందని అభ్యర్థి తొలగింపు.. “హిందువు” కాబట్టే తొలగించారని ఆరోపణ
- రీల్స్ చేస్తుందని అభ్యర్థిని తొలగించిన హుమాయున్ కబీర్..
- హిందువు కాబట్టే తొలగించారని నిషా ఛటర్జీ ఆరోపణ..
- బెంగాల్ ఎన్నికలకు ముందు వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిషా ఛటర్జీని తొలగించారు. బల్లిగంజ్ నియోజవర్గం నుంచి టీఎంసీ కీలక నేత బాబుల్ సుప్రీయోకు వ్యతిరేకంగా నిషా ఛటర్జీని తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి, కొంత సేపటికే ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.
Read Also: Rahul Gandhi: బీజేపీ విధానాలతో వైశ్య వ్యాపారులు దెబ్బతిన్నారు.. పోరాటం చేయాలని రాహుల్గాంధీ పిలుపు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
సోషల్ మీడియాలో నిషా ఫోటోలు, రీల్స్ చూశానని, ఆమెను తమ పార్టీ అభ్యర్థిగా పెడితే తప్పుడు సందేశాన్ని పంపుతుందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నానని కబీర్ చెప్పారు. త్వరలోనే కొత్త అభ్యర్థిని ప్రకటిస్తానని, ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి కావచ్చని ఆయన సూచించారు. అయితే, దీనిపై నిషా మాట్లాడుతూ.. మతం కారణంగా తనను తొలగించారని, తాను హిందువు కాబట్టే తనను పార్టీ నుంచి తొలగించినట్లు చెప్పింది. ఆయనది లౌకిక పార్టీ అయితే ఇలా జరిగేదా? అని ప్రశ్నించింది. బాబ్రీ మసీదుకు తాను మద్దతు ఇచ్చినప్పటికీ, తనను ఎందుకు తొలగించారని నిషా ఛటర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుమాయున్ కబీర్ పార్టీ బెంగాల్లోని 249 స్థానాలకు గానూ 135 స్థానాల్లో పోటీ చేస్తుందని, సామాన్యులతో పాటు ముస్లింల కోసం పనిచేస్తుందని చెప్పారు. తన పార్టీ నుంచి 70 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటాయని అన్నారు. అయితే, కొత్త పార్టీని టీఎంసీ తేలికగా తీసుకుంటుందని టీఎంసీ ప్రతినిధి జయప్రకాశ్ మజుందార్ అన్నారు. అయితే, కబీర్ పార్టీ గురించి బీజేపీ మాట్లాడుతూ.. టీఎంసీతో కలిసి బీజేపీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!