తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్.. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు..
వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కమిషన్ (ఏపీపీఎస్సీ).. 8 పోటీ పరీక్షలకు సంబంధించి.. తేదీలను వెల్లడించారు.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ..
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది. దేశవిదేశాల నుంచి అతిధులు తరలివచ్చే సమయం…
నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? అని ప్రశ్నించారు.. నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి కామెంట్ చేసిన ఆయన.. అయితే, 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని ఆకాక్షించారు..
2025 - 26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ తయారీ పై ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది..వచ్చే మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి..దీనిలో భాగంగా వచ్చే ఏడాది బడ్జెట్ పై ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది..గత ప్రభుత్వ పాలనలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని కుటమి సర్కార్ భావిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్..