Deputy CM Pawan Kalyan: రేపు పిఠాపురంలో పవన్ పర్యటన.. తొలిసారిగా ఏడీబీ రోడ్డులో..! ఎందుకంటే..?
- రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్..
- తొలిసారి ఏడీబీ రోడ్డులో పిఠాపురం వెళ్లనున్న డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ ను పరిశీలించనున్నారు పవన్.. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయబోతున్నారు డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు..
Read Also: Telangana: గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
మరోవైపు.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి పిఠాపురం రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.. అయితే, తొలిసారిగా ఆయన ఏడీబీ రోడ్డులో వెళ్తారట.. గతంలో కత్తిపూడి మీదగా రాకపోకలు సాగిస్తూ వచ్చారు పవన్ కల్యాణ్.. కానీ, రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఇకనుంచి తాను కూడా అదే రోడ్డు లో ప్రయాణం చేస్తానని.. ఏడీబీ రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన విషయం విదితమే.. ఏడీబీ రోడ్డు ప్రమాదంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఈ ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం.. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డు బాగా దెబ్బతింది.. గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తాం.. ఇక నుంచి పిఠాపురం పర్యటనకు గోతులతో కూడిన ఏడీబీ రోడ్డు గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!