US Tariff: భారతదేశంపై 25 శాతం ట్యాక్స్ ఎత్తివేయడానికి సిద్ధమైన ట్రంప్..? అమెరికా ట్రెజరీ కార్యదర్శి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariff: భారతదేశంపై అమెరికా విధించిన 25 శాతం సుంకాన్ని (టారిఫ్) భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు “చాలా విజయవంతమైందని” పేర్కొన్న ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే దీనిని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
25 శాతం సుంకం వల్ల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గాయన్న అమెరికా
స్కాట్ బెస్సెంట్ ప్రకారం, భారతదేశంపై 25 శాతం సుంకం విధించిన తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే ఈ సుంకాన్ని అమెరికా విజయవంతమైన చర్యగా భావిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ట్యారిఫ్ను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం అమెరికాకు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, “ఇప్పుడే ఈ సుంకాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నాను” అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు, భారత్–అమెరికా మధ్య చర్చలు పురోగమిస్తే 25 శాతం టారిఫ్ కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, చమురు వ్యాపారం అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
భారతదేశంపై అమెరికా ఎంత సుంకం విధిస్తోంది?
ప్రస్తుతం అమెరికా, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై మొత్తంగా 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. ఇందులో.. సుమారు 25 శాతం సాధారణ సుంకం (భారత ఎగుమతుల్లో దాదాపు 55 శాతంపై ప్రభావం).. ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చిన వచ్చింది 25 శాతం అదనపు ‘చమురు సంబంధిత జరిమానా సుంకం’.. ఈ అదనపు సుంకం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించాలని అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది.. రష్యా చమురుపై అమెరికా, G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి ధరల పరిమితి విధానాన్ని అమలు చేస్తున్నాయి. జనవరి 2026 వరకు బ్యారెల్కు సుమారు $47.60 ఉండగా.. ఫిబ్రవరి 1, 2026 నుంచి $44.10కి తగ్గించారు.. నిర్దేశిత ధర కంటే ఎక్కువకు రష్యన్ చమురును విక్రయిస్తే, బీమా, షిప్పింగ్, ఫైనాన్సింగ్ సేవలు అందించరాదనే నిబంధనలు ఉన్నాయి.
500 శాతం సుంకాల బిల్లు, భారత నిర్ణయాలు
ఈ ఒత్తిడుల నేపథ్యంలో భారత్, రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించిందని అమెరికా చెబుతోంది. రిలయన్స్ వంటి ప్రధాన భారతీయ రిఫైనరీలు జనవరి 2026లో రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, భారత్ తన జాతీయ ప్రయోజనాలు, సరసమైన ధరల ఆధారంగానే ఇంధన కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో ప్రతిపాదిత 500% సుంకాల బిల్లును భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. అయితే, భారతదేశంపై 25 శాతం సుంకం ఎత్తివేత జరిగితే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా భవిష్యత్ చర్చలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!