US Tariff: భారతదేశంపై 25 శాతం ట్యాక్స్ ఎత్తివేయడానికి సిద్ధమైన ట్రంప్..? అమెరికా ట్రెజరీ కార్యదర్శి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Tariff: భారతదేశంపై అమెరికా విధించిన 25 శాతం సుంకాన్ని (టారిఫ్) భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు “చాలా విజయవంతమైందని” పేర్కొన్న ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే దీనిని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
25 శాతం సుంకం వల్ల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గాయన్న అమెరికా
స్కాట్ బెస్సెంట్ ప్రకారం, భారతదేశంపై 25 శాతం సుంకం విధించిన తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే ఈ సుంకాన్ని అమెరికా విజయవంతమైన చర్యగా భావిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ట్యారిఫ్ను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం అమెరికాకు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, “ఇప్పుడే ఈ సుంకాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నాను” అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు, భారత్–అమెరికా మధ్య చర్చలు పురోగమిస్తే 25 శాతం టారిఫ్ కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, చమురు వ్యాపారం అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
భారతదేశంపై అమెరికా ఎంత సుంకం విధిస్తోంది?
ప్రస్తుతం అమెరికా, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై మొత్తంగా 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. ఇందులో.. సుమారు 25 శాతం సాధారణ సుంకం (భారత ఎగుమతుల్లో దాదాపు 55 శాతంపై ప్రభావం).. ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చిన వచ్చింది 25 శాతం అదనపు ‘చమురు సంబంధిత జరిమానా సుంకం’.. ఈ అదనపు సుంకం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించాలని అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది.. రష్యా చమురుపై అమెరికా, G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి ధరల పరిమితి విధానాన్ని అమలు చేస్తున్నాయి. జనవరి 2026 వరకు బ్యారెల్కు సుమారు $47.60 ఉండగా.. ఫిబ్రవరి 1, 2026 నుంచి $44.10కి తగ్గించారు.. నిర్దేశిత ధర కంటే ఎక్కువకు రష్యన్ చమురును విక్రయిస్తే, బీమా, షిప్పింగ్, ఫైనాన్సింగ్ సేవలు అందించరాదనే నిబంధనలు ఉన్నాయి.
500 శాతం సుంకాల బిల్లు, భారత నిర్ణయాలు
ఈ ఒత్తిడుల నేపథ్యంలో భారత్, రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించిందని అమెరికా చెబుతోంది. రిలయన్స్ వంటి ప్రధాన భారతీయ రిఫైనరీలు జనవరి 2026లో రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, భారత్ తన జాతీయ ప్రయోజనాలు, సరసమైన ధరల ఆధారంగానే ఇంధన కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో ప్రతిపాదిత 500% సుంకాల బిల్లును భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. అయితే, భారతదేశంపై 25 శాతం సుంకం ఎత్తివేత జరిగితే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా భవిష్యత్ చర్చలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..