WhatsApp యూజర్లకు షాక్.. డబ్బులు కడితేనే వాట్సాప్ సేవలు..!
- WhatsApp ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిందే..
- ప్రకటన రహిత సబ్స్క్రిప్షన్ మోడల్ను పరీక్షిస్తున్న సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: స్మార్ట్ ఫోన్ ఉంటే.. వాట్సాప్ ఉండాల్సిందే.. అలసు ఈ యాప్ లేని ఫోన్ ఉంటుందా? అనే స్థాయిలోకి తీసుకెళ్లింది ఈ యాప్.. తక్కువ కాలంలోనే ఎన్నో మార్పులు.. మరెన్నో అప్డేట్లు.. మెసేజ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో కీలక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్ఫామ్లో ప్రకటన రహిత (Ad-Free) సబ్స్క్రిప్షన్ మోడల్ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యాప్ కోడ్లో కొత్త సంకేతాలు
నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 కోడ్ను పరిశీలించినప్పుడు స్టేటస్ (Status) మరియు ఛానెల్స్ (Channels) విభాగాల్లో ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్స్క్రిప్షన్ మోడల్కు సంబంధించిన కొత్త స్ట్రింగ్లు గుర్తించారు. ఇది కంపెనీ భవిష్యత్తులో పెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ లేదా మాతృసంస్థ మెటా (Meta) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read
- PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
- Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
ప్రకటనలపై గతంలోనూ పరీక్షలు
అయితే, గత సంవత్సరం కూడా వాట్సాప్ స్టేటస్ మరియు ఛానెల్స్ విభాగాల్లో ప్రకటనలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. క్లిన్ యూజర్ ఇంటర్ఫేస్కి ప్రసిద్ధి చెందిన వాట్సాప్లో ప్రకటనలు రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెయిడ్ మోడల్పై ఇంకా స్పష్టత లేదు
వాట్సాప్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. అయితే, కంపెనీ నిజంగా ఈ ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయిస్తే, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వాట్సాప్ ప్రయాణం
వాట్సాప్ను 2009లో జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టన్ స్థాపించారు. 2010లో తక్షణ సందేశ సేవలు ప్రారంభించగా, 2011లో గ్రూప్ చాట్ ఫీచర్ను పరిచయం చేశారు. ఆండ్రాయిడ్, iOS ప్లాట్ఫార్మ్లపై విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ యాప్ను 2014లో ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా) 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ యాప్ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!