WhatsApp యూజర్లకు షాక్.. డబ్బులు కడితేనే వాట్సాప్ సేవలు..!
- WhatsApp ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిందే..
- ప్రకటన రహిత సబ్స్క్రిప్షన్ మోడల్ను పరీక్షిస్తున్న సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: స్మార్ట్ ఫోన్ ఉంటే.. వాట్సాప్ ఉండాల్సిందే.. అలసు ఈ యాప్ లేని ఫోన్ ఉంటుందా? అనే స్థాయిలోకి తీసుకెళ్లింది ఈ యాప్.. తక్కువ కాలంలోనే ఎన్నో మార్పులు.. మరెన్నో అప్డేట్లు.. మెసేజ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో కీలక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్ఫామ్లో ప్రకటన రహిత (Ad-Free) సబ్స్క్రిప్షన్ మోడల్ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యాప్ కోడ్లో కొత్త సంకేతాలు
నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 కోడ్ను పరిశీలించినప్పుడు స్టేటస్ (Status) మరియు ఛానెల్స్ (Channels) విభాగాల్లో ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్స్క్రిప్షన్ మోడల్కు సంబంధించిన కొత్త స్ట్రింగ్లు గుర్తించారు. ఇది కంపెనీ భవిష్యత్తులో పెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ లేదా మాతృసంస్థ మెటా (Meta) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
ప్రకటనలపై గతంలోనూ పరీక్షలు
అయితే, గత సంవత్సరం కూడా వాట్సాప్ స్టేటస్ మరియు ఛానెల్స్ విభాగాల్లో ప్రకటనలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. క్లిన్ యూజర్ ఇంటర్ఫేస్కి ప్రసిద్ధి చెందిన వాట్సాప్లో ప్రకటనలు రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెయిడ్ మోడల్పై ఇంకా స్పష్టత లేదు
వాట్సాప్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. అయితే, కంపెనీ నిజంగా ఈ ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయిస్తే, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వాట్సాప్ ప్రయాణం
వాట్సాప్ను 2009లో జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టన్ స్థాపించారు. 2010లో తక్షణ సందేశ సేవలు ప్రారంభించగా, 2011లో గ్రూప్ చాట్ ఫీచర్ను పరిచయం చేశారు. ఆండ్రాయిడ్, iOS ప్లాట్ఫార్మ్లపై విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ యాప్ను 2014లో ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా) 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ యాప్ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’తో రామ్చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
-
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
-
Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
-
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
-
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?