AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
- మూడో సంతానానికి ప్రోత్సాహం..
- సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది.
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతగా ఉండగా.. ఇప్పుడు జనాభాను పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయింది. సుస్థిర అభివృద్ధికి ఇది 2.1 శాతం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 శాతానికి చేరుతుందని.. ఇది ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
Read Also:Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగిన తల్లులకు కాన్పు సమయంలో రూ. 25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. అంతే కాకుండా.. రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒక నెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలల పెయిడ్ లీవ్ మంజూరు చేస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లల చదువు కోసం అందించే ఈ పథకం జనాభా వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. RSS ప్రముఖులు, జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు కూడా జనాభా సమతుల్యత అవసరమని అభిప్రాయపడటం ఈ పాలసీకి బలాన్నిస్తోంది. వచ్చే నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ డ్రాఫ్ట్ పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు. జనాభా నిర్వహణలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్గా నిలవనుంది.
తాజావార్తలు
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
-
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!