సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దీంతో, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు..
విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..
వేసవి సెలవుల సందర్భంగా శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే.. నేరుగా స్వామివారి దర్శనం కలిపిస్తున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సామాన్య భక్తులకు దర్శనాలు సులువుగా జరిగిపోతున్నాయి..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
సంక్రాంతి టైంలో... గోదావరి జిల్లాల్లో... కోడి పందేలు ఎంత ఫేమస్సో... పేకాట శిబిరాలు కూడా అంతే పాపులర్. ఆ మూడు రోజులు కూర్చున్న దగ్గర్నుంచి లేవకుండా ఆడే పేకాట రాయుళ్ళు ఉంటారంటే అతిశయోక్తి కాదు. దాన్ని సరదా అని వాళ్ళంటారు. జూదమని బయటి వాళ్లంటారు. సరే... ఎవరేమనుకున్నా... అదంతా అంతవరకే. పండగ ముచ్చట ముగిశాక అలాంటివి ఉండవు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారుతోందట.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ లీడర్స్, కేడర్కు గడ్డు కాలం నడుస్తోంది. కొన్ని చోట్ల కేడర్కు అండగా ఉండాల్సిన లీడర్స్ సేఫ్ జోన్స్ చూసుకుంటుంటే... గతంలో వాళ్ళనే నమ్ముకుని చెలరేగిపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారట. డైరెక్ట్గా అలాంటిది కాకున్నా... దాదాపుగా అదే తరహాలో, ఇంకా చెప్పుకోవాలంటే ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కార్యకర్తలు. రాయదుర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్, టిడిపి సమఉజ్జీలుగా ఉండేవి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి... వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు.
అది కంపెనీ అయినా... రాజకీయ పార్టీ అయినా... పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ఆచరించడమన్నది సహజ లక్షణం. ముందు చెప్పింది చేయడం మొదలుపెడితే... తర్వాత వేసే అడుగుల్లో... నాయకుల దిశా నిర్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడటం లేదట. పదే పదే నాయకత్వం సలహాలు..సూచనలు ఇస్తున్నా... ఆ స్థితి దాటి ఆదేశాల వరకు వెళ్ళినా సరే... కింది నాయకుల తీరు మారడం లేదంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మళ్లీ సన్నద్ధం అవుతుంటారు నాయకులు. కానీ... ఆ విషయంలో మర్చిపోయి.. నమ్ముకున్న క్యాడర్కు వెన్నుదన్నుగా ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని కూడా పట్టించుకోకుండా..