Minister Nadendla Manohar: జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు..!
- వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..
- అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు..
- ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. మద్యపాన నిషేధం అంటారు.. కానీ, ఆ హామీ అమలు ఎందుకు కాలేదు అని నిలదీశారు. అయితే, ప్రజలు మాకు అధికారం అభివృద్ధి కోసం ఇచ్చారు.. బటన్లు ఎక్కువ నొక్కుతారని కాదు అంటూ ఎద్దేవా చేశారు..
Read Also: AP and Telangana: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. జలవివాదంపై కీలక నిర్ణయాలు..
Also Read
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
ద్వీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ పంపిణీ వివరాలు వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మొదటి విడతలో 97 లక్షల మందికి గ్యాస్ పంపిణీ చేశాం.. రూ.846 కోట్లు ఖర్చు చేశాం. .రెండో విడతలో 91.10 లక్షల మందికి పంపిణీ చేశాం.. రూ. 712 కోట్లు ఖర్చయ్యాయి అని వివరించారు. రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు మాట్లాడే జగన్.. రూ.1600 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి ఎలా వెళ్లిపోయారు అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకమే చూపించారు.. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు అని తీవ్రంగా విమర్శించారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తూ.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు అని ఆరోపించారు.. పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి.. ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.. జగన్ పాలనపై ప్రజలే తీర్పు చెప్పారు.. అందుకే ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!