జనసేన పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్నినాని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.. పవన్ రాజకీయ ఊసరవెల్లి అన్నారు.. ఇక, అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అంటూ […]
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమ్నఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి..? ఆరోగ్య శ్రీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు..? అన్నింటికీ కారణం అభివృద్ధి లేకపోవడమే కారణం అన్నారు.. అమర్ రాజా సంస్థ, కియా అనుబంధ పరిశ్రమలు వైసీపీ చేసే గొడవకు వెళ్లిపోయాయని విమర్శించిన ఆయన.. గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేవ్.. టీడీపీ ఐదేళ్ల హయాంలో రూ. 53 వేల కోట్ల మేర మద్యం […]
వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంపూర్థ మద్యపాన నిషేదం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీనైనా చితక్కొట్టిస్తాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం.. మరోసారి ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొంటామన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన.. ప్రతిపక్షంలోకి ఉండి అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే రాజధానిని రద్దు చేసిందన్నారు.. […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా? […]
గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్ అన్నారు […]
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ […]
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్ […]
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్గా నియమితులయ్యారు. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్ […]
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు.. టెస్ట్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు కుప్పకూలింది.. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరవగా.. జట్టును గెలిపించలేకపోయారు.. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3, […]
అక్రమ లేఅవుట్లని తరచూ క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరిగింది.. దువ్వాడు సాగర్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ పై విచారణ సాగింది.. తెలంగాణలో అక్రమ “లేఅవుట్లు”లో ప్లాట్ల రిజస్ట్రేషన్ను అనుమతిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది.. తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించాలని 20 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి […]