తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ […]
ఆంధ్రప్రదేశ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవకతవకలు ప్రభుత్వ ఆదాయినిక భారీగా గండి కొట్టాయి.. దీంతో.. అప్రమత్తం అయిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అవకతవకలకు చెక్పెట్టే విధంగా అడుగులు వేస్తోంది.. దీనిపై మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను హెచ్వోడీ కార్యాలయాలకు అనుసంధానం చేసే […]
ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది… బంగారం స్మగ్లింగ్, జీఎస్టీ ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నారు.. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సొమ్ముతో అధికారులు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టబడటం కలకలం సృష్టించింది. ట్రావెల్స్ […]
తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని ఆయన ఆకాక్షించారు… శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. Read Also: KTR: కేటీఆర్కు అరుదైన అవకాశం.. ఐటీ మంత్రి హర్షం.. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని.. సమృద్ధిగా వానలు కురవాలని.. పంటలు బాగా పండాలని, రైతులకు […]
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా.. కొత్త కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం.. పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్… ఇటీవలే కేటీఆర్ టీమ్.. అమెరికాలో పర్యటించింది.. వారం రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో.. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, ఇన్నోవేషన్ వంటి నాలుగు సెక్టార్లలో పలు కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈవెంట్లు, 35 వరకు బిజినెస్ సమ్మిట్లలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా.. రూ.7,500 కోట్ల పెట్టుబడులను […]
మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు… హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 43 ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.. అతడే ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు… అతడి వద్ద నుంచి కోటి 30 లక్షల విలువచేసే 230 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఏ రంగంలో రాణించాలన్నా కొన్ని మెలుకువలు అవసరం.. ఇక్కడ మన దొంగ గారి తెలివితేటలు […]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్ […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు కీలక సమాచారాన్ని చేరవేసింది… డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతోన్న తరుణంలో.. తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయని సూచించింది.. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1 శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని […]
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఒంటిపూట బడుల సమయాన్ని కుదించింది ప్రభుత్వం.. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పాఠశాలలు పనిచేస్తున్నాయి.. ఇక, ఒకటో తరగతి నుండి 9వ తరగతి వరకు ఫైనల్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది విద్యాశాఖ… గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 7వ నుండి కాకుండా.. ఏప్రిల్ 16వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. ఇక, ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది.. అదే […]