Iran-India: భారత్కు శుభ పరిణామం.. హార్ముజ్ నుంచి భారీగా కదిలిన భారత్ నౌకలు
- హమ్మయ్య.. ఊపిరి పీల్చుకోవచ్చు
- భారత్కు ఇరాన్ పచ్చజెండా
- హార్ముజ్ నుంచి కదిలిన భారత్ నౌకలు
- తీరనున్న చమురు కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. హార్ముజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున భారతీయ చమురు నౌకలు తరలి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం కమ్ముకున్న వేళ భారతదేశానికి ఇరాన్ పచ్చజెండా ఊపింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన దౌత్యం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇరాన్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర నేతలుగా ఉన్న ప్రముఖులతో జైశంకర్ చర్చలు జరిపారు. తాజాగా ఆ దౌత్యం సత్ ఫలితాన్ని ఇచ్చింది. హార్ముజ్ జలసంధిలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్న తరుణంలో భారతదేశానికి చెందిన నౌకలు సాఫీగా వెళ్లేందుకు ఇరాన్ అన్ని విధాలుగా రూట్ క్లియర్ చేసింది. దీంతో ప్రస్తుతం 28 భారతీయ నౌకలు బయల్దేరాయి. దాదాపు 778 మంది నావికులు తిరిగి భారత్కు రానున్నారు. ఇప్పటికే రెండు నౌకలు ముంబైకి చేరుకున్నాయి.

Also Read
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Dhavaleswaram Barrage Flood: ధవలేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి.. కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక!
- TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
28 భారతీయ నౌకలు పెర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయాయి. అందులో 778 మంది నావికులు ఉన్నారు. తాజాగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. నౌకల్లో ఇరవై నాలుగు హార్ముజ్ జలసంధి పశ్చిమ భాగంలో ఉండగా.. నాలుగు తూర్పు భాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. 778 మంది నావికులతో కూడిన 28 భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్నాయని ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ పెద్దలతో జరిపిన సంభాషణ సత్ఫలితాన్ని ఇచ్చాయి.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో శత్రు దేశాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేసింది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్లకు వెళ్లే నౌకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశానికి ఇరాన్ ప్రత్యేక రాయితీని మంజూరు చేసింది. మొత్తానికి జైశంకర్ జరిపిన దౌత్యం అద్భుతంగా పని చేసింది.
తాజావార్తలు
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
-
Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
-
Dhavaleswaram Barrage Flood: ధవలేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి.. కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక!
-
1000 Cr Movie : 2026 సెకండాఫ్లో రూ. 1000 కోట్ల సినిమా ఏది? రేసులో నాలుగు సినిమాలు
ట్రెండింగ్
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!