ఏపీలో ఈ మధ్య జరిగిన టెన్త్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. అయితే, ఈ నెల నుంచి తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. దీంతో, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని […]
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు.. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని పేర్కొన్నారు.. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని.. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని […]
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.. అయితే, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. […]
అక్రమంగా అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తోంది సర్కార్.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏ షాపుకు వెళ్లినా.. జీఎస్టీ ఇంత శాతం అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. అదేస్థాయిలో వసూలు చేస్తున్నారు. ఇక, జీఎస్టీ నుంచి తప్పించుకోవడానికి బిల్లులు లేకుండా లావాదేవీలు సాగించేవారు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఇక, కేంద్రం ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కూడా షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ఈ రంగంపై జీఎస్టీ ఉండగా.. […]
వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. కొన్ని భయాలు కూడా.. లిక్కర్, బీర్ల సేల్స్ను ప్రభావితం చేస్తాయి… అయితే, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి కొంత మారింది… కూల్గా బీర్లు లాగించేవారు కూడా.. క్రమంగా వైన్, బ్రాండీ సేవించారు.. అయితే, ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది.. కరోనా భయాలు తొలగడంతో.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. మార్చి నుంచి మే […]
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి… మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్వెడార్కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తప్పుడు వదంతులపై నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని… తన అనుచరులు, భక్తులు, శిష్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నట్లు వివరించిన నిత్యానంద… వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని… […]
చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్ ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్ టైం జాబే […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్ను మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్కు పది కిలోమీటర్ల దూరంలో […]
దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే, […]
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోతున్న మొదటి భార్య చేసిన పనికి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. బీహార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్బాజార్కు ఖుర్షీద్ ఆలం అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం బీబీ పర్వీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. అయితే, ఎంతకీ వారికి సంతానం కలగకపోవడంతో.. పిల్లల కోసం రెండు సంవత్సరాల క్రితం రోష్మి ఖతూన్ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. […]