ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ఆముదాలవలస వెళ్లనున్నారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు. అయితే, సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధిస్తారని, కర్ఫ్యూ ప్రకటిస్తారనే ప్రచారం సాగింది.. ఆ వార్తలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆముదాలవలసకు రేపు 3.20 గంటలకు వస్తారు.. 10 నిమిషాల పాటు ప్రజలతో మమేకం అవుతారని.. సాయంత్రం 4.15 గంటల […]
మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కావడానికి సిద్ధం అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వరదల వల్ల తెలంగాణలో జరిగిన నష్టంపై అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఎంపీ మాధవ్కు సంబంధించినదంటూ ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇక, దానిపై స్పందించిన వైసీపీ ఎంపీ.. అది మార్ఫింగ్ చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు.. వారే కుట్రపూరితంగా నా ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
మీడియా చిట్చాట్లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నాడనే అర్థం వచ్చేలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు రచ్చగా మారాయి.. అసలు తాను ఎప్పుడూ బీజేపీ నేతలతో చర్చించలేదు.. వారితో ఎప్పుడూ టచ్లో లేనంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.. కొన్ని అభివృద్ధి పనులు విషయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో కలిసిన మాట వాస్తమే.. కానీ, బీజేపీలో టచ్లోకి వెళ్లడానికి వాటికి […]
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుంది.. వీడియో వాస్తవమని తేలితే …ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి..
శ్రీశైలం ప్రాజెక్టులో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి చాలా ప్రత్యేక ఉంది.. ఆ రోజున వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు మహిళలు.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరిస్తే మీ మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయిని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. అయితే, వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి.. శ్రావణ శుక్రవారం రోజు.. వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరిస్తే.. బాగుంటుందే.. భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ […]
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ఎన్నో ఉంటాయి.. ఇక, శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఎలాంటి స్తోత్రాలు వింటే మంచిది…? అనే అనుమానాలు కూడా […]