కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపునకు చేరుకుంది.. ఇవాళ్టితో ఈవెంట్ ముగియనుండగా.. చివరి రోజు పీవీ సింధు మరియు లక్ష్య సేన్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కోసం, పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాతో స్వర్ణ పతకం కోసం, భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం కోసం మ్యాచ్ ఆడనున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ నుండి 10 మంది శ్రీలంక క్రడీకారులు అదృశ్యమయ్యారని అధికారులు ప్రకటించారు.. తొమ్మిది మంది శ్రీలంక అథ్లెట్లు మరియు మేనేజర్ తమ ఈవెంట్లను పూర్తి చేసిన తర్వాత అదృశ్యం కావడం కామన్తెల్త్ గేమ్స్లో కలకలం సృష్టిస్తోంది.. అయితే, సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కామన్వెల్త్ క్రీడల బృందంలోని పది మంది సభ్యులు బ్రిటన్లో ఉండేందుకు అనుమానాస్పద ప్రయత్నంలో అదృశ్యమయ్యారని ద్వీప దేశానికి చెందిన ఒక ఉన్నత క్రీడా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.. మొదట జూడోకా చమీలా […]
భారత్ చేతిలో వెస్టిండీస్ మరోసారి చిత్తైంది. మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్ అయిన విండీస్... టీ-20 సిరీస్నూ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. వెస్టిండీస్తో జరిగిన చివరి టీ-20 మ్యాచ్లో 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
కామన్వెల్త్లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్లో భారత్ నుంచి పసిడి చేజారింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది మహిళా కమిషన్.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిందే తప్పు.. పైగా మళ్ళీ ఒక కులాన్ని దూషిస్తున్నాడని మండిపడ్డారు.. ఎంపీ పై చర్యలు తీసుకుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్రావు.