PVN Madhav: బీజేపీతో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగు దేశం కూడా భారతీయ జనతా పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం అన్నారు.. ఇప్పటికీ బిల్లులు మ్యానువల్ గా జరగడం వెనుక ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తున్నాం.. ఆర్ & ఆర్ నిర్ధారణ, నిర్వాసితుల గుర్తింపు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు.. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం అర్ధరహితం అని మండిపడ్డ ఆయన… అప్పు చేసైన ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రం పూర్తి చేస్తే బిల్లులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందన్నారు.. ఇక, విశాఖ రైల్వేజోన్ పై అపోహలకు ఆస్కారమే లేదు… జోన్ ఏర్పాటులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను సైతం దాటి పూర్తి చేయాలనే నిశ్చయంతో కేంద్రం ఉందని స్పష్టం చేశారు.
Read Also: Supreme Court: అబార్షన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
మరోవైపు.. టీడీపీ, వైసీపీలు బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ మాధవ్… అన్నీ కేంద్రానికి చెప్పే చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుంటే.. త్వరలోనే పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి… వీటి వెనుక ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎదగ కుండా చేస్తున్న కుట్ర కనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని విషయాల్లో సహకారం అందిస్తూనే ఉంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ సపోర్ట్ చేసింది.. మరోవైపు.. జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కొన్నిసార్లు.. రాజకీయ నేతల కామెంట్లు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!