Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Actress Vanisri Gets Back Land That She Lost 11 Years Back In Tamil Nadu

Vanisri: సీనియర్‌ హీరోయిన్‌ రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జా.. తిరిగి అప్పగించిన సీఎం..

Published Date :September 29, 2022 , 10:07 am
By Sudhakar Ravula
Vanisri: సీనియర్‌ హీరోయిన్‌ రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జా.. తిరిగి అప్పగించిన సీఎం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు ఎకరాల్లో కొనేవారు.. ఇప్పుడు గజాల్లో కొనుగోలు చేసేందుకే ఇబ్బంది పడుతున్నారు.. ఎస్‌ఎఫ్‌టీల్లో కొని సంబరపడాల్సిన పరిణామాలు వచ్చాయి.. అయితే, తెలుగు, తమిళ సినిమాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి వాణిశ్రీ భూమి కబ్జాకు గురైంది.. దాదాపు 11 ఏళ్ల క్రితం వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.20 కోట్లకు పై మాటేనటి.. అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి.. ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది తమిళనాడు ప్రభుత్వం.. సీఎం స్టాలిన్ స్వయంగా.. ఆ భూమి పత్రాలను వాణిశ్రీకి అందించారు.. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని కాపాడి.. తిరిగి యజమానులకు అందించారు. వారిలో ఒకరు వాణిశ్రీ.. ఇక, తిరిగి తన భూమి తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: IAS officer Shocking comments: ఫ్రీ అంటే కండోములు కూడా కావాలంటారు.. మహిళా ఐఏఎస్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

Also Read

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
  • Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?

సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా సంబంధిత భూమి పత్రాలు అందుకున్న వాణిశ్రీ… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రూ. 20 కోట్ల విలువైన తన భూమిని ఫేక్‌ సర్టిఫికెట్లతో కబ్జా చేశారు.. దీనిపై ఎంతో మందికి మొరపెట్టుకున్నాను.. ఎందరినో కలిశాను.. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై ఆ భూమిపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదనే నిర్ణానికి వచ్చాను.. కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కల్పించుకుని.. తన భూమిని తిరిగి ఇప్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు సీనియర్‌ హీరోయిన్‌ వాణిశ్రీ..

వాణిశ్రీ సహా ఐదుగురికి సంబంధించిన భూమిని కొందరు కబ్జా పెట్టారు.. అంతేకాదు నకిలీ పత్రాలు సృష్టించారు.. తమ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.. ఆ తర్వాత ఆ భూమిని విక్రయించే ప్రయత్నం చేశారు.. అసలు యజమానులకు ఈ విషయం తెలిసే.. అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.. తమకు జరిగిన మోసం గురించి అధికారులను ఆశ్రయించారు. సుదీర్ఘకాలం వారి పోరాటం కొనసాగింది.. ఇక, ఆశలు కూడా వదులుకున్నారు.. ఈ క్రమంలో భూకబ్జాలకు సంబంధించి 2021, సెప్టెంబర్‌లో తమిళనాడు శాసనసభ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.. 1908లో అమలులోకి తెచ్చిన చట్టాన్ని సవరించడానికి సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని సర్కార్‌ తీసుకొచ్చిన ఆ కొత్త చట్టం ప్రకారం నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా అక్రమంగా వేరే వారికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తే.. దానిని రద్దు​ చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పించింది ప్రభుత్వం.. ఆ బిల్లుకు 2022 ఆగస్టు 6న రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.. దీంతో, వాణిశ్రీకి చెందిన 20 కోట్ల విలువైన స్థలానికి కబ్జాదారుల చెర నుంచి విముక్తి లభించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Vanisri
  • CM M K Stalin
  • documents
  • Tamil Nadu
  • Vanisri land

తాజావార్తలు

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions