Sampath Kumar
Author- NTV Telugu-
U19 WC 2024: ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు!
U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్కు చెందిన సౌమ్య్కుమార్ పాండే వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది. […] -
Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్
Captain Suryakumar Yadav React on India Defeat against South Africa: దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, మంచి లక్ష్యాన్ని తాము కాపాడుకోలేకపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఓటమి నుంచి అందరం నేర్చుకుంటామని, మూడో టీ20పై ఫోకస్ పెడుతామన్నాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భరత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ […] -
IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలుసా?
IPL Auction 2024 Date and Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లపై కాసుల […] -
Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని.. ఆసియాకప్ 2023 సెమీస్కు దూసుకెళ్లిన భారత్!
India beat Nepal to enter U19 Asia Cup 2023 Semifinal: పేసర్ రాజ్ లింబాని (7/13) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్ 2023లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూపు-ఏలో భాగంగా మంగళవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్ల్లో రెండింట్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్లో అఫ్గనిస్తాన్ను చిత్తుచేసిన భారత్.. పాకిస్తాన్ చేతిలో […] -
Rinku Singh Six: రింకూ సింగ్ పవర్ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్
Rinku Singh Six Brokes window glass in IND vs SA 1nd T20: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68 […] -
Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav equals Virat Kohli’s Record: ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 1163 బంతుల్లో సూర్య ఈ ఫీట్ అందుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో మిస్టర్ 360 ఈ ఘనత అందుకున్నాడు. లిజాడ్ విలియమ్స్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని సింగిల్ తీసిన […] -
Sabarimala Pilgrims: శబరిమలలో భారీ రద్దీ.. దర్శనం కాకుండానే భక్తులు తిరుగుపయనం!
Pilgrims returning without visiting Sabarimala: కేరళలోని శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు కొనసాగుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12-18 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో భక్తులు వేచి చుస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉన్నా.. భక్తులకు అయ్యప్ప దర్శనం కావట్లేదు. దాంతో ఇతర […] -
Ponnam Prabhakar: ఏ సమస్యలు ఉన్నా.. ప్రజలు నేరుగా నన్ను కలవవచ్చు: పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar Visits Husnabad Govt Hospital: ఏ సమస్యలు ఉన్నా మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తా అని హామీ ఇచ్చారు. హుస్నాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని, కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి […] -
Fire Accident: టాటా ఏస్ వాహనం దగ్దం.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం!
Tata Ace Fire Incident in Jangaon District: జనగామ జిల్లాలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చిల్పూర్ మండలం వంగాలపల్లి వద్ద మంగళవారం ఉదయం ఓ టాటా ఏస్ వాహనం దగ్దం అయింది. మంటలు గమనించిన ప్రయాణికులు హుటాహుటిన వాహనం నుంచి కిందికి దిగిపోయారు. దాంతో వారు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. టాటా ఏస్ వాహనం రన్నింగ్ లో ఉండగానే మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ గాయాలు కాలేదు. షాట్ సర్క్యూట్ […] -
IPL Auction 2024: ఫ్రాంచైజీల కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే.. కోట్ల వర్షం పక్కా!
All Eyes on Travis Head and Rachin Ravindra at IPL Auction 202: 4ఐపీఎల్ 2024 కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 19న దుబాయ్లో జరిగే వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది భారతీయులు ఉండగా.. […]
తాజావార్తలు
-
Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Citadel Season 2: యాక్షన్లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
-
High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
-
Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!
ట్రెండింగ్
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!