Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma wife Ritika Sajdeh Comment On Mark Boucher’s Interview over MI Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై.. 2013 నుంచి కెప్టెన్గా వ్యవహిరించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. హార్దిక్కు ముంబై జట్టు పగ్గాలు అప్పగించడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ ముంబై యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రోహిత్ సతీమణి రితికా చేసిన కామెంట్స్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోంది.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గల కారణాలను వివరించాడు. ‘హార్దిక్ పాండ్యాను ఆటగాడిగా కొనసాగించాలనే మేం ముందుగా భావించాం. అయితే ప్రస్తుతం ముంబై టీమ్ పరివర్తన చెందే దశలో ఉంది. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. టీం కోసం ఉద్వేగాలకు అతీతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. రోహిత్ శర్మలోని ఆటగాడిని అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నాం. హిట్మ్యాన్ ఆటను ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా రన్స్ చేయనివ్వండి’ అని బౌచర్ అన్నాడు.
Also Read
మార్క్ బౌచర్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రోహిత్ శర్మ సతీమణి రితికా స్పందించారు. ‘ఇందులో చాలా విషయాలు తప్పు’ అని రితక కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది. మరోసారి ముంబై యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ కెప్టెన్సీపై ఉద్దేశపూర్వకంగానే ముంబై ఫ్రాంచైజీ వేటు వేసిందని హిట్మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2013 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ నియమించబడ్డాడు. అదే ఏడాది ముంబైకి మొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆపై రోహిత్ సారథ్యంలో ముంబై 2015, 2017, 2019, 2020లో టైటిల్స్ అందుకుంది. అయితే గత మూడు సీజన్లలో ముంబై పేలవ ప్రదర్శన చేసింది. 2021, 2022లో గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన ముంబై.. 2023లో ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది.
Also Read: Team India Coach: టీమిండియా కోచ్గా వచ్చేందుకు ఎప్పుడూ సిద్దమే: గ్యారీ కిరిస్టెన్
2015లో ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ కెరీర్ మొదలు పెట్టిన హార్దిక్ పాండ్యా.. 2021 వరకూ అదే జట్టులో ఉన్నాడు. ఈ క్రమంలో మంచి ఆల్రౌండర్గా ఎదిగాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న హార్దిక్ను ముంబై వదిలేసింది. 2022 వేలంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్.. 2023లో రన్నరప్గా నిలిచింది. అనూహ్యంగా గుజరాత్ కెప్టెన్సీ వదులుకుని ముంబై జట్టులో చేరాడు.
తాజావార్తలు
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!