Team India Coach: టీమిండియా కోచ్గా వచ్చేందుకు ఎప్పుడూ సిద్దమే: గ్యారీ కిరిస్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gary Kirsten interest on Team India Coaching: మరోసారి టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్దమే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్ గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించడంపైనే పూర్తి దృష్టి సారించా అని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్కు ఆదరణ పెరుగుతోందని, తమ దేశంలో క్రికెట్ బతకడానికి ఫ్రాంచైజీ టోర్నీ చాలా ముఖ్యమన్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే ప్రపంచకప్ను గెలిచిన సమయంలో టీమిండియాకు హెడ్ కోచ్ గ్యారీ కిరిస్టెనే అన్న విషయం తెలిసిందే. 2008 నుంచి 2011 వరకు గ్యారీ టీమిండియా కోచ్గా ఉన్నారు.
ఓ జాతీయ మీడియాతో గ్యారీ కిరిస్టెన్ మాట్లాడుతూ… ‘చాలా మంది యువ క్రికెటర్లకు ఫ్రాంచైజీ క్రికెట్ ఓ వరంగా మారింది. యువకులు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఇది మంచి అవకాశం. చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. దక్షిణాఫ్రికాలోనూ టీ20 లీగ్కు ఆదరణ పెరుగుతోంది. మా దేశంలో క్రికెట్ బతకడానికి ఇలాంటి టోర్నీ చాలా ముఖ్యం. ఫ్రాంచైజీ క్రికెట్ ఆర్థికంగానూ కీలకపాత్ర పోషిస్తుంది. క్రికెట్లోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినింపడంలో ఫ్రాంచైజీ లీగ్ల పాత్ర ఎంతో ఉంది. ఈ టోర్నీలకు పిల్లలు వెళ్లి తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చు. అంతేకాదు వారు కూడా క్రికెట్ ఆడే దిశగా ఆలోచన చేయొచ్చు’ అని అన్నాడు.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
Also Read: Zambia Cholera Outbreak: కలరాతో 600 మంది మృతి.. జాంబియాకు భారత్ సాయం!
‘ఐపీఎల్ కోసం నేను ప్రతి సంవత్సరం భారత్కు వస్తున్నా. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్కు మెంటార్గా వ్యవహరించబోతున్నా. భారత్తో నాకు మంది అనుబంధం ఉంది. టీమిండియాకు మరోసారి కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమే. అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఐపీఎల్ 2024లో గుజరాత్ను నడిపించడంపైనే దృష్టిసారించా. కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు. గత ఐపీఎల్లో 890 పరుగులు చేశాడు. అతడు కెప్టెన్గా కూడా రాణిస్తాడని నేను భావిస్తున్నా’ అని గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!