Rain Threat to RR vs MI in Guwahati: ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ రోజు గువాహటిలో తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆర్ఆర్ హ్యాట్రిక్పై గురి పెట్టింది. మరోవైపు ఈ సీజన్ను విజయంతో ఆరంభించిన ఎంఐ.. గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఈ మ్యాచ్లో గెలిచి మరలా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. అయితే […]
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి రెండు మ్యాచ్లలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలి రెండు మ్యాచ్లలో ఓటమి అనంతరం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్ట్రైక్రేట్పై విమర్శలు చేసిన వారిపై జింక్స్ ఫైర్ అయ్యాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు […]
ఐపీఎల్ 2026 సీజన్లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లు భారత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అతడు ఎదుర్కొనేది.. టీమిండియా పేసు గుర్రం, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను. సునాయాసంగా సిక్సులు బాదే వైభవ్.. బుమ్రా బౌలింగ్లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ముంబై […]
ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఒత్తిడికి గురై పేలవ ప్రదర్శన చేసిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా కొంతమంది ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. భారీ మొత్తాలు వెచ్చించిన ఫ్రాంచైజీలకు నిరాశను మిగులుస్తున్నారు. వేలంలో కోట్లు పెట్టి కొన్న కొన్ని ప్రాంఛైజీలు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ పూర్తిగా నిరాశపరిచాడు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ఒకటి. ఆర్సీబీ ఇటీవల చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. రూ.16,706 కోట్ల ధరకు ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఐపీఎల్ 2026 […]
భారత క్రికెట్లో స్పీడ్ కంటే.. స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాలో స్వింగ్ బౌలర్లు ఎందరో ఉన్నా.. భువీకి ఉన్న క్రేజ్ వేరే. ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉన్న సమయంలో వన్డేల్లో భువీతో వరుసగా 8 ఓవర్లు వేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీ20ల్లో కూడా అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తన స్వింగ్ బౌలింగ్తో కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో […]
గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకే గొడుగు కింద వుంటే నాయకత్వానికి కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ మూడు జిల్లాలుగా విభజించుకుంది. ఓల్డ్ సిటీ అంతా హైదరాబాద్ జిల్లాగా.. సికింద్రాబాద్.. ఖైరతాబాద్లుగా డివైడ్ చేసుకుంది. జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..హైదరాబాద్ జిల్లాకు సయ్యద్ ఖలిద్ సైఫుల్లాను…ఖైరతాబాద్ జిల్లాకు యూత్ లీడర్ మోత రోహిత్ ను..సికింద్రాబాద్కి దీపక్ జాన్ను అధ్యక్షులుగా నియమించింది. అంతవరకు బాగానే వుంది..అధ్యక్షులను పార్టీ నాయకత్వం వేసింది. కానీ. కమిటీ వెయ్యలేదు. అధ్యక్షులు గ్రౌండ్ లో పనీ చేయడం లేదు. […]
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తనపై జరిగిన దాడి ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తనను దారుణంగా కొట్టారని చెప్పాడు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని.. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారని తెలిపాడు. వదిలేయమని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలాడినా వినిపించుకోలేదని […]
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 సీజన్లో విఫలమవుతున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన గ్రీన్.. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతూ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ముంబై ఇండియన్స్పై జరిగిన మొదటి మ్యాచ్లో 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్పై 2 బంతుల్లో 4 […]
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి.. వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర–పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు […]