Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థతో అస్సాం రైఫిల్స్ సెమినార్
- గౌహతిలో భారత్-మయన్మార్ సరిహద్దు భద్రతపై చర్చ
- భద్రతా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ ప్రభావమా? అంటూ ఒవైసీ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) అనుబంధ సంస్థతో అస్సాం రైఫిల్స్ కలిసి నిర్వహించి ఒక సెమినార్ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. భారత భద్రతా వ్యవస్థపై అధికార పార్టీ సిద్ధాంతం ప్రభావం చూపుతోందా.? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ను బీజేపీ మాతృసంస్థగా భావిస్తారు. అస్సాం రైఫిల్స్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అంతర్గత భద్రత, సరిహద్దును నిర్వహిస్తోంది.
జూన్ 17, 18 తేదీల్లో గౌహతిలో ‘భారత్-మయన్మార్ సరిహద్దు సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణ’ అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని అస్సాం రైఫిల్స్తో పాటు సీమంత్ చేతనా మంచ్-నార్త్ ఈస్ట్ సంయుక్తంగా నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సీమంత్ చేతనా మంచ్ తనను తాను ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయేతర సంస్థగా పేర్కొన్నప్పటికీ, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ లేదా దాని భావజాలానికి దగ్గరగా ఉన్న సంస్థగా భావిస్తుంటారు.
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ఈ సెమినార్పై ఓవైసీ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తో రాష్ట్ర భద్రతా దళాల మధ్య పెరుగుతున్న సమన్వయం భారత భద్రతా వ్యవస్థను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోందనే అనుమానాలకు తావిస్తోంది’’ అని ఆయన ఎక్స్లో అన్నారు. ఈ సెమినార్కు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు దేశాలను విభజించవు, అదే దేశ భద్రతను, గుర్తింపును నిర్వచిస్తాయి అని అన్నారు.
The convergence between RSS, the ideological mothership of the political party in power, Bhartiya Janta Party and state security forces, is a marker of what potentially influences India’s security apparatus and thinking. https://t.co/Z7X538cGik
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2026
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!