Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
- ఇంగ్లండ్, భారత్ వైట్బాల్ సిరీస్
- రోహిత్, కోహ్లీపై అందరి దృష్టి
- ప్రపంచకప్లో రోహిత్ తప్పక ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్తో జరగనున్న వైట్బాల్ సిరీస్పై దృష్టి సారించింది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నిలిచింది.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్కు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ బ్యాటర్గా జట్టుకు సేవలందిస్తున్నాడు. అయితే ఇటీవల రోహిత్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోహిత్కు అండగా నిలిచాడు. సోనీ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. రోహిత్ అనుభవం భారత జట్టుకు ఎంతో విలువైనదని, అతడు కేవలం గొప్ప బ్యాటర్ మాత్రమే కాకుండా అద్భుతమైన నాయకుడని కొనియాడాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్రూమ్లో కూడా అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
Also Read
- BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
- Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
- Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
‘రోహిత్ శర్మ విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు పూర్తి స్పష్టత ఉందని నేను భావిస్తున్నాను. ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవచ్చు కానీ.. అతడు ప్రపంచకప్ ప్రణాళికల్లో కచ్చితంగా ఉన్నాడని నమ్ముతున్నాను. రోహిత్ అనుభవం అమూల్యమైనది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు ధైర్యం చెప్పే నాయకుడు రోహిత్. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అలాంటి ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు. రోహిత్ బ్యాటింగ్పై కూడా రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో కొన్నిసార్లు ఆకలి తగ్గినట్లు కనిపించవచ్చని, కానీ పెద్ద టోర్నీలు వచ్చినప్పుడు రోహిత్ తన అసలు స్థాయిని చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో జరగనున్న కీలక సిరీస్లో కూడా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశముందని తెలిపాడు.
ఇక ఇంగ్లండ్ సిరీస్కు యశస్వి జైస్వాల్ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై కూడా రాయుడు స్పందించాడు. ఆఫ్ఘనిస్థాన్పై రెండు సెంచరీలు సాధించినప్పటికీ అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. తన అభిప్రాయం ప్రకారం రోహిత్, యశస్వి ఇద్దరికీ 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం ఉండాలని సూచించాడు. ‘రోహిత్ గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు, అసాధారణ నాయకుడు కూడా. అదే సమయంలో యశస్వి కూడా అవకాశానికి పూర్తిగా అర్హుడు. భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అదే సమయంలో రోహిత్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో ఉంటే ప్రపంచకప్లో భారత్కు మరింత బలం చేకూరుతుంది’ అని రాయుడు స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
-
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!