Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
- ఇంగ్లండ్, భారత్ వైట్బాల్ సిరీస్
- రోహిత్, కోహ్లీపై అందరి దృష్టి
- ప్రపంచకప్లో రోహిత్ తప్పక ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్తో జరగనున్న వైట్బాల్ సిరీస్పై దృష్టి సారించింది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నిలిచింది.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్కు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ బ్యాటర్గా జట్టుకు సేవలందిస్తున్నాడు. అయితే ఇటీవల రోహిత్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోహిత్కు అండగా నిలిచాడు. సోనీ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. రోహిత్ అనుభవం భారత జట్టుకు ఎంతో విలువైనదని, అతడు కేవలం గొప్ప బ్యాటర్ మాత్రమే కాకుండా అద్భుతమైన నాయకుడని కొనియాడాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్రూమ్లో కూడా అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
Also Read
- Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
- IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
‘రోహిత్ శర్మ విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు పూర్తి స్పష్టత ఉందని నేను భావిస్తున్నాను. ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవచ్చు కానీ.. అతడు ప్రపంచకప్ ప్రణాళికల్లో కచ్చితంగా ఉన్నాడని నమ్ముతున్నాను. రోహిత్ అనుభవం అమూల్యమైనది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు ధైర్యం చెప్పే నాయకుడు రోహిత్. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అలాంటి ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు. రోహిత్ బ్యాటింగ్పై కూడా రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో కొన్నిసార్లు ఆకలి తగ్గినట్లు కనిపించవచ్చని, కానీ పెద్ద టోర్నీలు వచ్చినప్పుడు రోహిత్ తన అసలు స్థాయిని చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో జరగనున్న కీలక సిరీస్లో కూడా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశముందని తెలిపాడు.
ఇక ఇంగ్లండ్ సిరీస్కు యశస్వి జైస్వాల్ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై కూడా రాయుడు స్పందించాడు. ఆఫ్ఘనిస్థాన్పై రెండు సెంచరీలు సాధించినప్పటికీ అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. తన అభిప్రాయం ప్రకారం రోహిత్, యశస్వి ఇద్దరికీ 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం ఉండాలని సూచించాడు. ‘రోహిత్ గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు, అసాధారణ నాయకుడు కూడా. అదే సమయంలో యశస్వి కూడా అవకాశానికి పూర్తిగా అర్హుడు. భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అదే సమయంలో రోహిత్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో ఉంటే ప్రపంచకప్లో భారత్కు మరింత బలం చేకూరుతుంది’ అని రాయుడు స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి