IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
- ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్ధమైన భారత్
- తొలి టీ20లో మార్పులతో బరిలోకి భారత్
- ఇంగ్లండ్ సిరీస్లో వైభవ్ అరంగేట్రం
- ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Predicted Playing XI for England T20I: ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఘోర పరాజయాలు చూసి పరువు మొత్తం పోగొట్టుకున్న భారత్.. ఇంగ్లండ్తో కీలక టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐర్లాండ్పై అపజయాలను మరిచి.. ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఐర్లాండ్ సిరీస్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయినట్లు సమాచారం.
ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనిపై మరోసారి విశ్వాసం ఉంచిందట. ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో కూడా సంజుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో రాణించి విమర్శలకు సమాధానం చెప్పాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ కొత్త ఓపెనింగ్ జోడితో బరిలోకి దిగనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనునట్లు తెలుస్తోంది.
Also Read
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
- LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కీపర్ సంజు శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏకైక స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగం, స్పిన్ సమతుల్యతతో భారత జట్టు కూర్పును సిద్ధం చేసింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన సూర్యాన్ష్ షెడ్గే తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు.
ఇంగ్లండ్తో తొలి టీ20లో భారత తుది జట్టు:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
సంజు శాంసన్ (కీపర్)
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
ప్రిన్స్ యాదవ్
అర్ష్దీప్ సింగ్
రవి బిష్ణోయ్
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!