IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
- ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్ధమైన భారత్
- తొలి టీ20లో మార్పులతో బరిలోకి భారత్
- ఇంగ్లండ్ సిరీస్లో వైభవ్ అరంగేట్రం
- ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Predicted Playing XI for England T20I: ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఘోర పరాజయాలు చూసి పరువు మొత్తం పోగొట్టుకున్న భారత్.. ఇంగ్లండ్తో కీలక టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐర్లాండ్పై అపజయాలను మరిచి.. ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఐర్లాండ్ సిరీస్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయినట్లు సమాచారం.
ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనిపై మరోసారి విశ్వాసం ఉంచిందట. ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో కూడా సంజుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో రాణించి విమర్శలకు సమాధానం చెప్పాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ కొత్త ఓపెనింగ్ జోడితో బరిలోకి దిగనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనునట్లు తెలుస్తోంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కీపర్ సంజు శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏకైక స్పిన్నర్గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగం, స్పిన్ సమతుల్యతతో భారత జట్టు కూర్పును సిద్ధం చేసింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన సూర్యాన్ష్ షెడ్గే తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు.
ఇంగ్లండ్తో తొలి టీ20లో భారత తుది జట్టు:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
సంజు శాంసన్ (కీపర్)
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
ప్రిన్స్ యాదవ్
అర్ష్దీప్ సింగ్
రవి బిష్ణోయ్
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!