PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
- వంట మనిషిపై దాడి ఆరోపణలు
- పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై కేసు నమోదు
- మానసిక వేధింపులు, దురుసు ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS Star Shashank Singh Assault Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ శశాంక్ సింగ్ సహా అతడి తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదైంది. తమ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిపై దాడి చేసి.. దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉచిత భోజనం, వసతి:
‘నేను ఇటీవల రేవా నుంచి తెలిసిన వ్యక్తి ద్వారా భోపాల్కు వచ్చాను. భారత క్రికెటర్ శశాంక్ సింగ్ ఇంట్లో పనికి చేరాను. నెలకు రూ.15 వేల జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగంలో చేరిన కొద్ది గంటల్లోనే నాకు మానసిక వేధింపులు, దురుసు ప్రవర్తన ఎదురైంది’ అని విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో ఆరోపించాడు.
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
వంట మనిషిపై దాడి చేశారు:
‘నేను వండిన ఆహారం బాగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది భరించలేక ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోతా అని చెప్పాను. వెంటనే శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్ ఆగ్రహానికి గురయ్యారు. నా మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని.. ఎవరితోనూ మాట్లాడకుండా అడ్డుకున్నారు. నన్ను బలవంతంగా పని చేసేలా ఒత్తిడి తెచ్చారు. భయంతో ఒక గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నా. శశాంక్ సింగ్, శైలేష్ సింగ్, వారి డ్రైవర్ తలుపు తెరిచి నాపై దాడి చేశారు’ అని ఫిర్యాదులో విపేంద్ర సింగ్ తోమర్ వివరించాడు.
ముఖం, శరీరంపై గాయాలు:
బాధితుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ముఖం, శరీరంపై గాయాల గుర్తులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫిర్యాదు, వైద్య నివేదికల ఆధారంగా రతీబాద్ పోలీసులు శశాంక్ సింగ్, శైలేష్ సింగ్ సహా వారి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 296(B) (అశ్లీల ప్రవర్తన, దుర్భాషలాడటం), సెక్షన్ 115(2) (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం/దాడి), సెక్షన్ 3(5) (సామూహిక ఉద్దేశంతో నేరానికి పాల్పడటం) కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!