HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- హస్మత్పేటలో హైడ్రా ఆపరేషన్
- రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- ప్రజల ఆస్తిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్మత్పేటలో హైడ్రా చేపట్టిన చర్యపై నిరుపేదల ఇళ్లను కూల్చివేశారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హస్మత్పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. దశాబ్దాలుగా జరిగిన అక్రమ ఆక్రమణల కారణంగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి కేవలం 10 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. ఈ చివరి భూమిని కూడా ఆక్రమణదారుల నుంచి కాపాడి భవిష్యత్ ప్రజా అవసరాల కోసం భద్రపరచాలనే ఉద్దేశంతోనే హైడ్రా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న శాశ్వత ఇళ్లను ఎక్కడా కూల్చలేదని అధికారులు స్పష్టం చేశారు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరించిన ఇళ్లను తొలగించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల అధికారిక లేఖ ఆధారంగా.. వారి సమక్షంలో భారీ పోలీసు బందోబస్తుతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో కేవలం ప్రభుత్వ భూమిపై కొత్తగా నిర్మించిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకే ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చేపట్టిన చట్టబద్ధమైన పరిపాలనా చర్య అని అధికారులు వెల్లడించారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ప్రస్తుతం హైడ్రా రక్షించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భూమి కూడా కబ్జాకు గురైతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాల కోసం భూమి అందుబాటులో ఉండదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి కాబట్టి.. వాటిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. హస్మత్పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకుంటూ ప్రజా ఆస్తిని కాపాడిన చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!