HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- హస్మత్పేటలో హైడ్రా ఆపరేషన్
- రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- ప్రజల ఆస్తిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్మత్పేటలో హైడ్రా చేపట్టిన చర్యపై నిరుపేదల ఇళ్లను కూల్చివేశారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హస్మత్పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. దశాబ్దాలుగా జరిగిన అక్రమ ఆక్రమణల కారణంగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి కేవలం 10 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. ఈ చివరి భూమిని కూడా ఆక్రమణదారుల నుంచి కాపాడి భవిష్యత్ ప్రజా అవసరాల కోసం భద్రపరచాలనే ఉద్దేశంతోనే హైడ్రా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న శాశ్వత ఇళ్లను ఎక్కడా కూల్చలేదని అధికారులు స్పష్టం చేశారు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరించిన ఇళ్లను తొలగించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల అధికారిక లేఖ ఆధారంగా.. వారి సమక్షంలో భారీ పోలీసు బందోబస్తుతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో కేవలం ప్రభుత్వ భూమిపై కొత్తగా నిర్మించిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకే ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చేపట్టిన చట్టబద్ధమైన పరిపాలనా చర్య అని అధికారులు వెల్లడించారు.
Also Read
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
ప్రస్తుతం హైడ్రా రక్షించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భూమి కూడా కబ్జాకు గురైతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాల కోసం భూమి అందుబాటులో ఉండదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి కాబట్టి.. వాటిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. హస్మత్పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకుంటూ ప్రజా ఆస్తిని కాపాడిన చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!