Sampath Kumar
Author- NTV Telugu-
IND vs WI: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (173; 253 బంతుల్లో 22 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. యశస్వితో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (20) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ […] -
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. […] -
AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
కల్తీ మద్యం తయారీ విషయంలో ఇంటి దొంగల పాత్ర గుర్తించడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు వేసింది. ఇప్పుడు కేసులకు కీలక నిందితుడు జనార్దన్ బార్, అదే విధంగా కల్తీ మద్యం తయారీ డంప్ బయటపడిన పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. సీఐ పరిధిలో జనార్ధన్, అతని అనుచరుడు కళ్యాణ్ స్థానిక శ్రీనివాస వైన్స్లో […] -
AP Cabinet Meeting: కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!
ఏపీ కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగా ప్రచారం చేయలేకపోయాం అని ఫైర్ అయ్యారు. యూనిట్కు 13 పైసలు తగ్గించినా.. మనం జనాలకు చెప్పుకోలేకపోయారంటూ విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు ఇచ్చారు. […] -
IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 13-15 వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ అధికారులు బీసీసీఐతో చర్చలు జరుపుతున్న క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్ను ఇంకా ఫిక్స్ చేయలేదు. వేలంకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 2026 వేలానికి ముందు కఠిన […] -
Richa Ghosh: దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన రిచా ఘోష్!
ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్తో అలరించింది. గురువారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో రిచా 77 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. రిచా చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత జట్టు 251 పరుగులు చేసింది. 102/6తో పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న జట్టును రిచా ఒంటిచేత్తో ఆడుకుంది. ఓ దశలో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అని […] -
Hyderabad Tragedy: అలసిపోయిన అమ్మ.. చిన్న కొడుకు కళ్లెదుటే దారుణం!
ఓ వైపు కొడుకు అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని భర్త.. పైగా ఆర్ధికంగా రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కొడుకుపై దొంగతనం ముద్ర పడడంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ తల్లి అలసిపోయి.. ఇక బతకలేనని నిర్ణయించుకుంది. పుట్టెడు దుఃఖంతో చిన్న కొడుకు కళ్లెదుటే బలవన్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం నింపింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు నరసింహ, సుధ. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. సుధ, […] -
Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు!
హైదరాబాద్లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్లో […] -
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్లోకి ఆరేళ్ల చిన్నారి!
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా ఇటియాథోక్లోని భిఖంపూర్వా బ్లాక్కు చెందిన 6 ఏళ్ల బాలిక అనామిక మిశ్రా అథ్లెట్లు కూడా కష్టంగా భావించే అరుదైన ఘనతను సాధించింది. అనామిక ఆరేళ్ల వయసులో ఒక గంటలో 10 కిలోమీటర్ల పరుగును ఆగకుండా పూర్తి చేసింది. అంతేకాదు ఎనిమిది నిమిషాల్లో 240 పుషప్స్ పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. యోగా, పరుగు, వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ఫిట్నెస్పై దృష్టి పెట్టిన అనామిక.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో బంగారు పతకం […] -
IND vs SA: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న రిచా ఘోష్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. కష్టాల్లో పడిన జట్టును రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) ఆడుకుంది. అయితే తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరలో స్నేహ్ రాణా (33) ధాటిగా ఆడింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23)లు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. […]
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!