BC Janardhan Reddy: మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేస్తాం!
- మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
- మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేస్తాం
- ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితి పొడిగింపు చేశాం అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయని, హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పర్యవేక్షించారు.
‘మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాలపరిమితి పొడిగింపు చేశాం. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయి. ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగింది. మార్చి 2026 నాటికి ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2వ సారి కాలపరిమితి పొడిగింపు చేశాం. దాదాపు రూ.3500 కోట్లతో ఈ 9 ఫిషింగ్ హార్బర్లు అన్ని పూర్తి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని టూరిజం హాబ్గా తీర్చిదిద్దాలని మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారు’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
‘కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై మేము ప్రతీ నెలా సమీక్షలు చేస్తున్నాం. స్థానిక మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తాం. సీ మౌత్ సమస్యపై టెక్నికల్గా పరిష్కరించేందుకు చెన్నైకి పంపించాం. అది వచ్చే 45 రోజుల్లో వస్తోంది, వచ్చిన తర్వాత సీ మౌత్ను కూడా పూర్తి చేస్తాం’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!