మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితి పొడిగింపు చేశాం అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయని, హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. మచిలీపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పర్యవేక్షించారు.
‘మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాలపరిమితి పొడిగింపు చేశాం. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయి. ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగింది. మార్చి 2026 నాటికి ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2వ సారి కాలపరిమితి పొడిగింపు చేశాం. దాదాపు రూ.3500 కోట్లతో ఈ 9 ఫిషింగ్ హార్బర్లు అన్ని పూర్తి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని టూరిజం హాబ్గా తీర్చిదిద్దాలని మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారు’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.
‘కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై మేము ప్రతీ నెలా సమీక్షలు చేస్తున్నాం. స్థానిక మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మార్చి 2026కు ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తాం. సీ మౌత్ సమస్యపై టెక్నికల్గా పరిష్కరించేందుకు చెన్నైకి పంపించాం. అది వచ్చే 45 రోజుల్లో వస్తోంది, వచ్చిన తర్వాత సీ మౌత్ను కూడా పూర్తి చేస్తాం’ అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చెప్పారు.