Sampath Kumar
Author- NTV Telugu-
Shree Charani: క్రికెటర్ శ్రీ చరణిపై వరాల జల్లు.. గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు సహా..!
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీ చరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. Also Read: Ambati Rambabu: కూటమి ప్రభుత్వానికి […] -
Ambati Rambabu: కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం.. అంబటి ఆసక్తికర కామెంట్స్!
ఈనెల 12న మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల ర్యాలీని వైసీపీ నిర్వహించనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ర్యాలీలు జరగనున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ర్యాలీ కొనసాగనుంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం ర్యాలీల పోస్టర్ను పార్టీ నేతలు రిలీజ్ చేశారు. పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మనోహర్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పోస్టర్ […] -
MSK Prasad: మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్కు చేదు అనుభవం.. బీసీసీఐకి ఫిర్యాదు?
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్కు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణికి ఘన స్వాగతం పలికేందుకు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లగా.. విమానాశ్రయ సిబ్బంది ఎంఎస్కేను లోపలికి అనుమతి లేదంటూ అడ్దకున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకుంది. ఈ విషయంపై ఎస్పీకి ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ జోక్యంతో ఎయిర్పోర్ట్లోనికి ఆయనకు అనుమతి దక్కింది. Also Read: Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన […] -
Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన క్రికెటర్ శ్రీ చరణి!
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోగా.. శ్రీ చరిణికి మంత్రులు అనిత, సంధ్యా రాణి, ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని సహా మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువా కప్పి ఘనంగా అసత్కరించారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన శ్రీ చరణికి […] -
RCB Sale: అమ్మకానికి ఆర్సీబీ టీమ్.. పోటీలో ఆరుగురు బడా వ్యాపారవేత్తలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2026కి ముందే ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉందని డియాజియో పీఎల్సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి ఓ లేఖ రాసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం […] -
Vizag KGH: కింగ్ జార్జ్ హాస్పిటల్కు వీడిన గ్రహణం.. కానీ మహిళా పెషేంట్ మృతి!
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్ […] -
Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్ కప్ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అరుంధతి రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ […] -
What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి.. […] -
Daily Horoscope: ఆ రాశి వారు నేడు జాగ్రత్త.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు!
వృషభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహా విష్ణువు. నేడు మీరు చేయాల్సిన పూజ విష్ణు శాస్త్రనామ స్తోత్రంను పారాయణం చేయాలి. ఈక్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ […] -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్పై ఏపీలో ‘కాయ్ రాజా కాయ్’.. కోడి పందేలకు మించి బెట్టింగ్!
జూబ్లీహిల్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇటు తెలంగాణ, అటు ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతోంది. హైదరాబాద్లో వుంటున్న బంధువులను వాకబు చేస్తూ మరీ…పందెం కాస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతోంది. మారుతున్న సమీకరణలు, విసురుతున్న సవాళ్లు… వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారోనన్న సస్సెన్స్ ట్వంటీ20 మ్యాచ్ను తలపిస్తోంది. అన్ప్రిడిక్టబుల్ గా మారిన జూబ్లీహిల్స్ పోరు..సహజంగానే బెట్టింగ్ రాయుళ్లను టెమ్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జూబ్లీహిల్స్ ఎన్నికపై కాయ్ రాజా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?