Virat Kohli: మైదానంలో అతడి కాళ్లు మొక్కిన కోహ్లీ.. వీడియో వైరల్!
- ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన
- ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 443 రన్స్
- ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 51 రన్స్
- ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 443 రన్స్ చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విరాట్.. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో నిలకడగా ఆడాడు. ఆర్సీబీ ఛేదనలో ఇబ్బందిపడుతున్న సమయంలో 47 బంతుల్లో 51 రన్స్ చేసి విజయానికి బాటలు వేశాడు. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ మ్యాచ్ అనంతరం మైదానంలో తన చిన్ననాటి కోచ్ ఆశీర్వాదం తీసుకున్నాడు.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డీసీ, ఆర్సీబీ మ్యాచ్కు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన రాజ్కుమార్.. కోహ్లీని కలిశారు. కోచ్ రాకను గమనించిన విరాట్.. అతని కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆపై కోహ్లీని హగ్ చేసుకున్న ఆయన.. ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోచ్ పట్ల మర్యాద, గౌరవం చూపిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే’, ‘కోహ్లీ చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి’, ‘విరాట్ నిరాడంబరతకి ఇదే నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
Also Read: RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!
కోచ్ రాజ్కుమార్ శర్మ కాళ్లను విరాట్ కోహ్లీ మొక్కడం ఇదే మొదటి కాదు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడినప్పుడు కూడా కోహ్లీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడే ప్రతిసారీ మైదానం మొత్తం నిండిపోతుంది. 2023లో కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, 13 సంవత్సరాల తర్వాత ఢిల్లీ తరపున రైల్వేస్తో రంజీ మ్యాచ్ ఆడినప్పుడు, ఆదివారం ఆర్సీబీ తరఫున ఆడినా అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. విరాట్ ఆర్సీబీకి ఆడుతున్నా తమ సూపర్స్టార్ను చూడడానికి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, సోనిపట్ నుంచి ఫాన్స్ భారీగా హాజరయ్యారు.
Virat Kohli touching his Childhood Coach Rajkumar Sharma’s feet after yesterday’s match. ❤️🙇 pic.twitter.com/x7flrq2fLV
— Tanuj (@ImTanujSingh) April 28, 2025
Virat Kohli embraces his childhood coach Rajkumar Sharma and humbly touches his feet. 🥹❤️
— A beautiful moment of pure respect and gratitude from the King! 👑🙇 pic.twitter.com/0FOGnVPmeM
— Rio (@CricRio6) April 28, 2025
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!