Virat Kohli: మైదానంలో అతడి కాళ్లు మొక్కిన కోహ్లీ.. వీడియో వైరల్!
- ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన
- ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 443 రన్స్
- ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 51 రన్స్
- ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో 443 రన్స్ చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విరాట్.. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో నిలకడగా ఆడాడు. ఆర్సీబీ ఛేదనలో ఇబ్బందిపడుతున్న సమయంలో 47 బంతుల్లో 51 రన్స్ చేసి విజయానికి బాటలు వేశాడు. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ మ్యాచ్ అనంతరం మైదానంలో తన చిన్ననాటి కోచ్ ఆశీర్వాదం తీసుకున్నాడు.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డీసీ, ఆర్సీబీ మ్యాచ్కు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన రాజ్కుమార్.. కోహ్లీని కలిశారు. కోచ్ రాకను గమనించిన విరాట్.. అతని కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆపై కోహ్లీని హగ్ చేసుకున్న ఆయన.. ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోచ్ పట్ల మర్యాద, గౌరవం చూపిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే’, ‘కోహ్లీ చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి’, ‘విరాట్ నిరాడంబరతకి ఇదే నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
Also Read: RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!
కోచ్ రాజ్కుమార్ శర్మ కాళ్లను విరాట్ కోహ్లీ మొక్కడం ఇదే మొదటి కాదు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడినప్పుడు కూడా కోహ్లీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడే ప్రతిసారీ మైదానం మొత్తం నిండిపోతుంది. 2023లో కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, 13 సంవత్సరాల తర్వాత ఢిల్లీ తరపున రైల్వేస్తో రంజీ మ్యాచ్ ఆడినప్పుడు, ఆదివారం ఆర్సీబీ తరఫున ఆడినా అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. విరాట్ ఆర్సీబీకి ఆడుతున్నా తమ సూపర్స్టార్ను చూడడానికి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, సోనిపట్ నుంచి ఫాన్స్ భారీగా హాజరయ్యారు.
Virat Kohli touching his Childhood Coach Rajkumar Sharma’s feet after yesterday’s match. ❤️🙇 pic.twitter.com/x7flrq2fLV
— Tanuj (@ImTanujSingh) April 28, 2025
Virat Kohli embraces his childhood coach Rajkumar Sharma and humbly touches his feet. 🥹❤️
— A beautiful moment of pure respect and gratitude from the King! 👑🙇 pic.twitter.com/0FOGnVPmeM
— Rio (@CricRio6) April 28, 2025
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!