ఎక్కడ…? మేడం ఎక్కడ…..? అసలేమైపోయారు? ఇలా వచ్చారు… అలా పదవి కొట్టేశారు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఎంత హైకమాండ్ కోటాలో పోస్ట్ వస్తే మాత్రం ఇలా గాయబ్ అయిపోతారా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో హాట్ హాట్గా జరుగుతున్న చర్చలివి. ఇంతకీ…. వాళ్ళంతా ఏ మేడమ్ కోసం వెదుకుతున్నారు? పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదా? లేక ఆమే లైట్ తీసుకుంటున్నారా? లెట్స్ వాచ్. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక గురించి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో గట్టి చర్చే […]
‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ దారుణంగా ఉంటుంది’’.. పాక్కు భారత్ వార్నింగ్.. భారత్ మరోసారి ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆ దెబ్బ తీవ్రత మరింత గట్టిగా ఉంటుందని భారత సైనిక ఉన్నతాధికారి హెచ్చరించారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ […]
తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ […]
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం , ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా, 27.02.2026 నుండి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని , […]
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అడ్డగోలుగా తవ్వేసుకోవడం, ఇనప్పెట్టెల్లో పోగేసుకోవడమేనా? అదేమంటే…. వాళ్ళకు పవర్ ఉన్నప్పుడు చేయలేదా? ఇప్పుడు మేం చేస్తే… తప్పేంటని గడుసుగా ప్రశ్నిస్తున్నారా? అన్నా… ఏదన్నా పని చూపించమని అక్కడి ఎమ్మెల్యేని ఎవరైనా అడిగితే… ఓ టిప్పర్ కొనుక్కో… లైఫ్లో సెటిలైపో అంటూ కూల్గా సమాధానం చెబుతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఎవరా ఎమ్మెల్యే? కోట సాక్షిగా…. చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యధేచ్చగా జరిగిపోతున్నాయి. సెగ్మెంట్లోని దాదాపు 25 ప్రాంతాలను అక్రమ […]
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని పొంగులేటి ఆరోపించారు. “38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును […]
సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు భారీ ఆపరేషన్ను చేపట్టారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 139 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్న ముఠాలను పోలీసులు మట్టుబెట్టారు. అరెస్టయిన నిందితులు సుమారు 1,000 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు […]
చొరబాటుదారుల్ని దేశం నుంచి తొలగిస్తాం.. బీహార్ నుంచే ప్రారంభిస్తామన్న అమిత్ షా చొరబాటుదారుల నుంచి విముక్తి అంటే కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదని.. భారత నేల నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడిని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్లోనే సీమాంచల్ ప్రాంతంలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సీమాంచల్ నుంచే చొరబాటుదారులను ఏరివేస్తామని వెల్లడించారు. ‘‘ఈ రోజు […]
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెండు రోజుల క్రితం రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటిపర్యంతమయ్యారు. […]
శ్రీవారి భక్తులు తిరుమల దర్శనం , వసతి గదుల కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలిన విధంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘాను ముమ్మరం చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ పేరుతో గదులు ఇప్పిస్తామన్న నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోవడంతో […]